నొప్పించి ఉంటే క్షమించండి : తనికెళ్ల భరణి

Surya Prakash   | Asianet News
Published : Apr 16, 2021, 07:23 AM IST
నొప్పించి ఉంటే క్షమించండి : తనికెళ్ల భరణి

సారాంశం

ఆ వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. దీంతో ఆ పోస్టు తొలగించాను. దీనిపై నేను వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు.

ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై భిన్నమైన వాదనలు మొదలైయ్యిన సంగతిత తెలిసిందే. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి ట్విటర్‌  ద్వారా స్పందించారు.  ఏ మనిషికీ ఇతరుల మనసును నొప్పించే హక్కు  లేదని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని  తనికెళ్ల భరణి అన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై కొంతమంది నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక వీడియో పంచుకున్నారు.

 ‘శభాష్‌ రా శంకరా..’ అంటూ గత కొన్ని రోజులుగా నేను ఫేస్‌బుక్‌లో పోస్టూ చేస్తూ వచ్చాను. అయితే.. ఆ వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. దీంతో ఆ పోస్టు తొలగించాను. దీనిపై నేను వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకే జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నా’ అంటూ తనికెళ్ల భరణి వీడియో ద్వారా తెలియజేశారు.
 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి