Bigg Boss Tamil: బిగ్ బాస్ రచ్చ.. నటి వనితా విజయ్ కుమార్ పై దాడి, తీవ్ర గాయాలు

By Mahesh JujjuriFirst Published Nov 26, 2023, 1:24 PM IST
Highlights

తమిళ బిగ్ బాస్ లో రచ్చ రచ్చ జరుగుతోంది. బిగ్ బాస్ ప్రభావం తమిలనాట హౌస్ బయట కూడా కనిపిస్తోంది. ఈక్రమంలో ప్రముఖ నటి వనిత విజయ్ కుమార్ పై జరిగిన దాడి సంచలనంగా మారింది. 
 

బిగ్ బాస్ హౌస్ అంటేనే రచ్చ రచ్చ. ప్రాణ మిత్రులుగా ఉన్నవారు కూడా.. హౌస్ లో తెలియకుండానే బద్ర శత్రువులుగా మారుతారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంత పెద్ద శత్రువులు అయినా..బయటకు వచ్చిన తరువాత మంచి మిత్రులుగా మారుతారు. కాని  తమిళ బిగ్ బాస్ లో మాత్రం.. ఇంటా బయట రచ్చ రచ్చ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జరిగే గొడవలు ప్రభావం బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ పై పడుతుంది. ప్రస్తుతం తమిళ్ లో  బాస్ సీజన్ 7 నడుస్తోంది. కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న ఈ షో లో రచ్చ రచ్చ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న గొడవల ప్రభావం బయట కూడా కనిపిస్తోంది. ఈ సీజన్ లో పార్టిసిపెంట్ చేసి, ఇటీవల ఎలిమినేట్ అయిన నటి వనిత విజయ్ కుమార్ పై శనివారం రాత్రి దాడి జరిగింది. 

అమర్‌ - తేజస్వీ, నిరుపమ్ - మంజుల, జాకీ - హరిత, సిద్దార్ద్ - విష్ణు ప్రియా, సీరియల్ కలిపిన బంధం, ప్రేమ పెళ్లి

Latest Videos

సౌత్ లో ముఖ్యంగా తమిళ, తెలుగు పరిశ్రమలో స్టార్ యాక్టర్ గా ఉన్న  విజయ్ కుమార్ కూతురు వనిత, సాహో నటుడు అరుణ్ కుమార్, హీరోయిన్ శ్రీదేవిల సోదరి వనిత. కాని ఈమెకు ఇంట్లో వారికి సంబంధాలు తెగిపోయాయి. వారు వనితను దూరం పెడుతూ వస్తున్నారు. కాగా ఆమె ఒక్కతే తన పిల్లలతో లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వెళ్లిన వినిత.. తాజాగా  ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. వచ్చిన తరువాత కూడా బిగ్ బాస్ పై రివ్యూలు ఇస్తూ ఉంది వనిత.  యూట్యూబ్ ఇంటర్వ్యూలు,  రివ్యూలతో బిజీ బిజీగా ఉన్న వనితా విజయ్.. శనివారం రాత్రి కూడా ఇలాగే రివ్యూ ఇచ్చి, డిన్నర్ చేసి ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది.

స్టూడియోకు దగ్గర్లో పార్క్ చేసిన తన కారు వద్దకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఒకరు సడెన్ గా ఎదురొచ్చి వనితపై దాడి చేశాడు. దీంతో వనిత ముఖంపై గాయమైంది. ఈ విషయాన్ని వనిత సోషల్ మీడియాలో పంచుకుంది. తనపై ప్రదీప్ ఆంటొని సానుభూతిపరుడే దాడి చేశాడని ఆరోపిస్తోంది. ప్రదీప్ కు రెడ్ కార్డ్ ఇస్తావా అంటూ ఆగంతుకుడు తనపై దాడికి పాల్పడ్డాడని పేర్కొంది.

 

బిగ్ బాస్ 7 సీజన్ లో భాగంగా హౌస్ లోకి నటుడు ప్రదీప్ ఆంటోని కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే హౌస్ లో జరుగుతున్న గొడవలు, మారిన పరిణామాల మధ్య.. రీసెంట్ గానే  ప్రదీప్ ను రెడ్ కార్డ్ తో కమల్ హాసన్ బయటకు పంపించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రదీప్ కు మద్దతుగా ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ప్రదీప్ ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రదీప్ కు వ్యతిరేకంగా ఉన్న వనితా విజయ్ కుమార్ పై  ప్రదీప్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. 

Khushboo : త్రిష, మన్సూర్ ఇప్పుడు బాగానే ఉన్నారు.. మధ్యలో ఖుష్బూ బుక్కైపోయిందిగా, ఏం జరిగిందంటే

ఇక ఈ  ఎలిమినేషన్ విషయంలో వనితపై కోపంగా ఉన్నారు అభిమానులు. దాంతో ప్రదీప్ సపోర్టర్ ఒకరు వనిత కనిపించగానే  కోపం ఆపుకోలేక  ఈ దాడికి పాల్పడ్డట్లు వనిత ఆరోపిస్తోంది. అయితే, వనిత ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కొందరు సూచిస్తుండగా.. ఇదంతా అబద్ధమని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తమిళ బిగ్ బస్ రచ్చ రచ్చ అవుతోంది. 

click me!