స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్లతో ఐటమ్ సాంగ్స్ చేయించడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త భామలతో పోటీ ఎక్కువవడంతో ఐటమ్ సాంగ్స్ చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనకాడటంలేదు. ఈ నేపథ్యంలోనే ‘జై లవ కుశ’ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. ప్రస్తుతం తెలుగులో తమన్నాకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎన్టీఆర్ సినిమాలో ఐటమ్ సాంగ్తో తమన్నా ఫేట్ మారిపోతుందని, అవకాశాలు పెరగడం ఖాయమని అంతా ఊహించారు. చిత్ర యూనిట్ కూడా ఈ పాట మూవీకే హైలైట్ అవుతుందని ప్రచారం చేసింది.
‘స్వింగ్ జరా’ అంటూ సాగే ఈ హుషారైన పాటను మొత్తం ఆడియోతో కాకుండా సెపరేట్గా విడుదలచేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కానీ సినిమా చూసిన తరవాత ఆడియన్స్ తమన్నాపై పెదవి విరుస్తున్నారు.తమన్నా సాంగ్ ఆశించినంతగా అలరించకపోగా, సినిమా నెగిటివ్ ఎలిమెంట్స్లో ఒకటిగా నిలిచిందని ప్రేక్షకులు అంటున్నారు. తమన్నా ఐటమ్ సాంగ్ వల్ల ‘జై లవ కుశ’కు కలిసొచ్చేది ఏమీ లేదని, ఈ సాంగ్ కన్నా ‘జనతా గ్యారేజ్’లో కాజల్ చేసిన ఐటమ్ సాంగ్ చాలా బాగుందని ఆడియన్స్ టాక్.
కాకపోతే తారక్ నట విశ్వరూపంతో ‘జై లవ కుశ’ నెగిటివ్స్ అన్నీ మాయమైపోయాయి. కేవలం తమన్నా ఐటమ్ సాంగ్ కోసమే సినిమాకు వెళ్లేవారికి మాత్రం నిరాశ తప్పదని అంటున్నారు. కాగా, తమన్నా గతంలో ‘అల్లుడు శీను’ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే ‘ఆగడు’ సినిమాలో శృతిహాసన్, ‘సరైనోడు’లో అంజలి, ‘నాయక్’లో చార్మి, ‘కొమరంపులి’లో శ్రియ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేశారు. వీళ్ల విషయంలో కూడా అప్పట్లో రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి.