ప్రజెంట్ జనరేషన్ హీరోలపై సుబ్బిరామిరెడ్డి సెటైర్లు!

By tirumala ANFirst Published Sep 3, 2019, 9:09 PM IST
Highlights

కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి సినీ ప్రముఖుల ప్రతి ఏటా తన పుట్టినరోజున అవార్డుని అందిస్తూ వస్తున్నారు. వైభవంగా కార్యక్రమం నిర్వహించి అవార్డుల ప్రధానం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆ రోజుల జరగబోయే కార్యక్రమం గురించి వివరించారు. 

కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి సినీ ప్రముఖుల ప్రతి ఏటా తన పుట్టినరోజున అవార్డుని అందిస్తూ వస్తున్నారు. వైభవంగా కార్యక్రమం నిర్వహించి అవార్డుల ప్రధానం చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఆ రోజుల జరగబోయే కార్యక్రమం గురించి వివరించారు. 

ఈ సారి తన పుట్టినరోజున సహజ నటి జయసుధకు 'అభినయ మయూరి' అనే అవార్డు ప్రధానం చేయబోతున్నట్లు సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ఆమె 46 ఏళ్లుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారని సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ప్రజెంట్ జనరేషన్ హీరోలని పోల్చుతూ సుబ్బిరామిరెడ్డి విమర్శలు చేశారు. 

దేవుడు సృష్టించిన కళలలో సినిమా చాలా గొప్పది. ఈ విషయం చాలా మందికి తెలియక సినిమా వాళ్లని చులకనగా చూస్తుంటారు. అది సరైంది కాదని సుబ్బిరామిరెడ్డి అన్నారు. అదేవిధంగా గతంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ అవార్డు వచ్చినా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు హాజరై తీసుకుని వెళ్లేవారు. కానీ ప్రజెంట్ జనరేషన్ హీరోలు సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. 17న జరగబోయే ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 

click me!