సుశాంత్ సూసైడ్ కేసు: రియా కాల్‌ లిస్ట్‌లో సంచలన విషయాలు

By Satish ReddyFirst Published Aug 7, 2020, 4:55 PM IST
Highlights

ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు రియా చక్రవర్తి హాజరైంది. సీబీఐ తీసుకోవటంతో కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలో పోలీసులు రియా కాల్‌ డాటాను విశ్లేషిస్తున్నారు. దీంతో సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

సంచలనం సృష్టించిన సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించి రోజుకో వార్త వెలుగు చూస్తోంది. ముంబై పోలీసులతో పాటు పాట్నా పోలీసులు, సీబీఐ, ఈడీలో ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి చుట్టే కేసంతా తిరుగుతోంది. రియా సుశాంత్‌ను ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు రియా చక్రవర్తి హాజరైంది. సీబీఐ తీసుకోవటంతో కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలో పోలీసులు రియా కాల్‌ డాటాను విశ్లేషిస్తున్నారు. దీంతో సంచలన విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. రియా గత ఏడాది కాలంలో దర్శక నిర్మాత మహేష్ భట్‌కు 16 సార్లు కాల్ చేసినట్టుగా గుర్తించారు.

సుశాంత్ సంచలన వీడియో లీక్: మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలని ప్లాన్

తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో గత సంవత్సరంలో 1122 సార్లు కాల్ చేసినట్టుగా గుర్తించారు. తనకు, సుశాంత్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న శృతి మోదికి 808 సార్లు చేసినట్టుగా గుర్తించారు. వీరితో పాటు తల్లి, సంధ్య చక్రవర్తి, తమ్ముడు షోయిక్‌ చక్రవర్తిలకు తరుచూ కాల్ చేసినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే ఏడాది కాలంలో ఆమె సుశాంత్ కు కేవలం 147 సార్లు మాత్రమే కాల్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఒక్క జనవరి నెలలోనే రియా సుశాంత్‌కు 19 సార్లు కాల్‌ చేసినట్టుగా పోలీసు విచారణలో వెల్లడైంది. తాజాగా సుశాంత్ మృతి కేసులో రియా, షోయిక్‌, ఇంద్రజిత్‌, రియా తల్లి సంధ్య, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శృతీ మోదీ, సుశాంత్ సింగ్‌ హౌస్‌ మేనేజర్‌, రియా ఫ్రెండ్‌ శామ్యూల్‌ మిరాండాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

click me!