వడ్డీలోడు వచ్చెనే.. అంటున్న హీరో సూర్య

By Prashanth MFirst Published Apr 12, 2019, 8:04 PM IST
Highlights

తమిళ స్టార్ సూర్య కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘గజిని’, ‘సింగం’వంటి  చిత్రాలతో ఇక్కడ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని  క్రియేట్ చేసుకుని, ఇక్కడా తన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో భాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు. 

తమిళ స్టార్ సూర్య కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘గజిని’, ‘సింగం’వంటి  చిత్రాలతో ఇక్కడ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని  క్రియేట్ చేసుకుని, ఇక్కడా తన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆయన సినిమాలు ఈ మధ్యకాలంలో భాక్సాఫీస్ వద్ద ఆడటం లేదు. 

ఈ నేపధ్యంలో  ప్రస్తుతం ఎన్ జీకే టైటిల్ తో  పొలిటికల్‌ జానర్‌లో తెరకెక్కుతున్న మూవీతో ఫ్యాన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌, టీజర్‌తో అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్‌.. తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేశారు. ‘వడ్డీలోడు వచ్చెనే... గడ్డి కోసం చూసెనే...’అంటూ చంద్రబోస్ రాసిన పాటను సత్యన్ పాడారు. ఈ పాటకు యువన్ శంకర్‌రాజా అందించిన సంగీతం చాలా విభిన్నంగా ఉంది. 

 ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’, ‘రిలయెన్స్‌ ఎంటర్టైన్మెంట్‌’ బ్యానర్‌ ల పై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాల క ష్ణ).  

సూర్య తో జంటగా సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటించే ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ

                                                        

click me!