ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేసిన మహేష్‌.. సూపర్‌ స్టార్‌ బర్త్ డేకి నో ట్రీట్‌

By Aithagoni RajuFirst Published May 27, 2021, 4:31 PM IST
Highlights

కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ వస్తుందని అంతా భావించారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా `సర్కారువారి పాట` నుంచి ఎలాంటి అప్‌డేట్‌ని ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

కరోనా అందరికి నిరాశనే మిగుల్చుతుంది. తాజాగా మహేష్‌ ఫ్యాన్స్ కి కూడా నిరాశ తప్పడం లేదు. ఈ నెల 31న సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు. తన తండ్రి బర్త్ డే సందర్భంగా మహేష్‌ నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ వస్తుందని అంతా భావించారు. ఆ వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సినిమాలో మహేష్‌ని ఓ కొత్త లుక్‌లో చూడొచ్చని ఆతృతగా వెయిట్‌ చేస్తున్నారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లింది మహేష్‌ టీమ్‌. 

 ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా `సర్కారువారి పాట` నుంచి ఎలాంటి అప్‌డేట్‌ని ఇవ్వడం లేదని మహేశ్‌బాబు టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. `దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని `సర్కారు వారి పాట` సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబృందం భావించింది. సినిమా అప్‌డేట్‌ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సృష్టించవద్దు. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా అధికారిక ఖాతాల్లో తప్పకుండా పోస్ట్‌ చేస్తాం. అప్పటివరకూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి` అని మహేశ్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. 

ALERT!! 🔔 pic.twitter.com/kiKunIj8QC

— Team Mahesh Babu (@MBofficialTeam)

మహేష్‌ హీరోగా కీర్తిసురేష్‌ కథానాయికగా `సర్కారువారి పాట` సినిమా రూపొందుతుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇదిలా ఉంటే మహేష్‌ నెక్ట్స్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ప్రారంభిస్తారని తెలుస్తుంది. మరి ఇదైనా జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్నది చూడాలి. 

click me!