తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదట.. సురేష్ బాబు పరువు మొత్తం పోయింది

First Published Apr 12, 2018, 5:35 PM IST
Highlights
తేజ ప్రయత్నించినా.. శ్రీరెడ్డి వినలేదట.. సురేష్ బాబు పరువు మొత్తం పోయింది

ఎన్నో ఫ్లాపుల తర్వాత నేనే రాజు నేనే మంత్రి తో ఒక హిట్ తీశాడు తేజ. ఆ వెంటనే వెంకటేష్ తో సినిమా తీయమని తన బ్యానర్ లోనే ఆఫర్ ఇచ్చాడు సురేష్ బాబు. అంతా బాగానే ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వెంకటేష్ సినిమా తేజ కెరీర్ కి హెల్ప అయ్యేది. అయితే శ్రీరెడ్డి అభిరామ్ ఇష్యూలో  శ్రీరెడ్డిని సైలెంట్ అయ్యేలా చేస్తానని తేజ సీన్ లోకి ఎంటరయ్యాడు.  శ్రీరెడ్డి తో మాట్లాడాడు కూడా కాంప్రమైస్ చేశాడు. ఆ తర్వాత శ్రీరెడ్డి కి తాను డైరెక్ట్ చేస్తున్న రెండు సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నానని ఒక రేంజ్ లో చెప్పుకున్నాడు. ఇక ఇండస్ట్రీ లో ఉన్న మిగతావాళ్లు కూడా అవకాశాలు ఇవ్వాలని భారీ డైలాగ్ కొట్టాడు. 

అయితే తెర వెనుక ఏం జరిగిందో ఏమో గానీ మా అసోసియేషన్ ప్రెస్ మీట్ తర్వాత శ్రీరెడ్డి అడ్డం తిరిగింది. తేజను అడ్డు పెట్టుకుని తనను బక్రాను చేస్తున్నారన్న అనుమానం శ్రీరెడ్డికి వచ్చింది. ఆవెంటనే సముదాయించాలనుకున్నారు కానీ తేజ మాట వినకుండా అభిరామ్ తో సన్నిహిత ఫోటోలు భయటపట్టేసింది. ఆ దెబ్బతో తేజ సురేష్ బాబుల బండారం మొత్తం బయటపడింది. శ్రీరెడ్డి దగ్గర ఉన్న సాక్ష్యాలు బయటపెట్టకుండా ఉండడానికి తనకు ఆఫర్లు ఇస్తున్నానంటు ఈ బడా ఫ్యామిలీ తరపున తేజ శ్రీరెడ్డికి తేజ పెట్టిన కండీషన్. ఈ విషయం లో తేజ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని మానేజ్ చేస్తానని చెప్పి ఇలా పూర్తిగా పరువు పోయేలా చేశాడని సురేష్ బాబు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అందుకే తేజ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడంట.

click me!