
ఒకప్పుడు సౌత్ యాంకర్స్ అంటే చాలా ట్రెడిషినల్ లుక్ లో కనిపించి ఆకట్టుకునే వారు. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టు పరభాషా యాంకర్స్ గాలి సౌత్ ఇండస్ట్రీకి బాగానే పాకింది. లేటెస్ట్ గా రష్మీ - అనసూయ లాంటి యాంకర్స్ వారి గ్లామర్ తో అదరగొట్టేస్తున్నారు.
ఇక శ్రీ ముఖి కూడా అప్పుడపుడు తన గ్లామర్ తో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మధ్య ఫొటో షూట్స్ లలో కూడా పాల్గొంటూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి పెంచుకుంటోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్టైలిష్ అండ్ బ్లాక్ మోడ్రన్ డ్రెస్సులో అమ్మడు ఇచ్చిన హాట్ ఫోజులకు కామెంట్స్ ఓ రేంజ్ లో అందుతున్నాయి. ఇంటర్నెట్ లో ప్రస్తుతం అమ్మడి ఫొటోలు తెగ హల్ చల్ చేస్తుండడంతో చూస్తుంటే హీరోయిన్ గా వెలగాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీ ముఖి కొన్ని రియాలిటి షోలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.