నుదురు, ముఖంపై తీవ్రగాయాలు.. మిస్టరీగా వాణీ జయరాం మరణం?

Published : Feb 04, 2023, 03:47 PM IST
నుదురు, ముఖంపై తీవ్రగాయాలు.. మిస్టరీగా వాణీ జయరాం మరణం?

సారాంశం

నేపథ్య గాయని వాణీ జయరాం మరణానికి సంబంధించి ఇప్పుడు షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె తీవ్ర గాయాల స్థితిలో కన్నుమూయడం పెద్ద షాకిస్తుంది. 

లెజెండరీ సింగర్‌ వాణీ జయరాం హఠాన్మరణం ఇప్పుడు ఇండియన్‌ చిత్ర పరిశ్రమని తీవ్ర షాక్‌కి గురి చేస్తుంది. ఆమెకి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించగా, ఇంతలోనే విషాదం చోటు చేసుకోవడం దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. అయితే నేపథ్య గాయని వాణీ జయరాంకి సంబంధించి ఇప్పుడు షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె తీవ్ర గాయాల స్థితిలో కన్నుమూయడం పెద్ద షాకిస్తుంది. 

బెడ్‌మీద నుంచి పడినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. కానీ నుదురు, ముఖంపై తీవ్రగాయాల స్థితిలో ఆమె స్పృహతప్పి పడిపోయి ఉన్నారు. తలుపు కొట్టినా బయటకు రాకపోవడంతో ఇంటి పనిమనిషి తలుపు బద్దలు కొట్టి ఆమెని బయటకు తీసుకొచ్చారు. దీంతో అప్పటికే ఆమె గాయాలతో ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి రాకముందే ఆమె ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 

వాణీ జయరాం భర్త నాలుగేండ్ల(2018) క్రితం చనిపోయారు. ఆమెకి పిల్లలు లేరు. దీంతో ఒక్కతే, ఒంటరిగా ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. దాదాపు 10-11గంటల మధ్య పని మనిషి ఇంట్లో పనిచేస్తూ ఉంటుందట. వాణీ జయరాం గాయాలతో కనిపించడంతో ఎవరో కొట్టినట్టుగా ఉందని ఆమె పోలీసులకు సమాచారం అందించారు. ఆమె కాలు జారి కింద పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

వారం రోజులుగా ఏం జరిగిందనేది పోలీసులు ఆరా తీస్తున్నారట. ఆమె పేరుమీద ఏవైనా విలువైన ఆస్తులున్నాయా? అనేది విచారిస్తున్నారు. అయితే ఎవరైనా కొడితే తలుపులు ఎలా మూసి ఉంటాయనేది అనుమానంగా మారింది. ఈ ఘటన ఈరోజు ఉదయం 11.30గంటల సమయంలో చోటు చేసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. మరికాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓ గొప్ప గాయని విషయంలో ఇలా జరగడం అత్యంత విచారకరం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!
Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్