Singer Sunitha : కొడుకు సినిమా చూసి... కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత.. ఎందుకంటే?

By Nuthi SrikanthFirst Published Jan 6, 2024, 5:29 PM IST
Highlights

స్టార్ సింగర్ సునీత Singer sunitha కొడుకు హీరోగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా ‘సర్కారు నౌకరీ’ Sarkaaru Noukari. ఈ మూవీ చూసిన తర్వాత సునీత చాలా ఎమోషనల్ అయ్యింది.
 

ప్రముఖ సింగర్‌ సునీత కొడుకు ఆకాష్‌ Akash హీరోగా పరిచయం అవుతూ జనవరి 1న `సర్కారు నౌకరి` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కొత్త ఏడాది సందర్భంగా విడుదలైంది. భావన హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. గంగనమోని శేఖర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని కె రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం. ఆర్కే టెలి ఫిల్మ్ బ్యానర్ పై సినిమాను రూపొందించారు. ప్రేక్షకుల నుంచి కూడా ఈ మూవీకి మంచ రెస్పాన్సే దక్కింది. 

ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం సింగర్ సునీతా ఎంతో కృషి చేశారు. హీరోగా తన కొడుకును నిలబెట్టేందుకు చాలా ప్రయత్నించింది. చివరి డిఫరెంట్ కథతో వచ్చిన సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. థియేటర్లలో కొనసాగుతున్న ఈ చిత్రాన్ని సింగర్ సునీతా తాజాగా చూసింది. కొడుకును వెండితెరపై చూసిన సునీతా భావోద్వేగానికి గురయ్యారు. సినిమా అనంతరం మీడియాతో మాట్లాడారు. 

Latest Videos

ఎడిటింగ్ రూమ్ లోనే ఈ సినిమా మొత్తాన్ని చూశారని చెప్పారు. కానీ థియేటర్లలో మళ్లీ చూడాలనిపించిందన్నారు. సినిమా చూశాక చాలా గర్వంగా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. హీరోగా ఆకాశ్ చాలా బాగా నటించడమే అందుకు కారణమన్నారు. సినిమాల్లో యాక్ట్ చేస్తానని చెప్తూ ఉండేవాడు.. కానీ ఇంతలా పెర్ఫామ్ చేస్తాడనుకోలేదు. తల్లిగా నా పిల్లలు ఎదుగుతుంటే తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి.’ అంటూ ఎమోషనల్ అయ్యారు. 

‘సర్కారు నౌకరి’ చిత్రంలో ఆకాష్ తల్లిదండ్రులు లేని పాత్ర, హెల్త్ ప్రమోటర్ రోల్ నటించాడు. జీవితంపై కసితో ఉన్నత స్థాయికి వెళ్లాలని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. హెల్త్ ప్రమోటర్ గా ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తుంటారు. ఆ వ్యాధిని అరికట్టేందుకు ఇంటింటికి నిరోధ్ లు కూడా పంపిణీ చేస్తుంటాడు. మంచి మెసేజ్ ఉన్న కథలో ఆకాశ్ తన నటనతో మెప్పించారు. 

click me!