బ్లాంక్‌ కాల్స్ వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సింగర్‌ మధుప్రియ ఫిర్యాదు

Published : May 22, 2021, 05:09 PM ISTUpdated : May 22, 2021, 05:11 PM IST
బ్లాంక్‌ కాల్స్ వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సింగర్‌ మధుప్రియ ఫిర్యాదు

సారాంశం

గాయని మధుప్రియ పోలీసులను ఆశ్రయించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాంగ్‌ కాల్స్ తో తనని వేధిస్తున్నారని ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

గాయని మధుప్రియ పోలీసులను ఆశ్రయించింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాంగ్‌ కాల్స్ తో తనని వేధిస్తున్నారని ఆమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆ మేరకు శనివారం షీ టీమ్‌కి ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియా ద్వారా తనని వేధిస్తున్నారని, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వస్తున్న బ్లాంక్‌ కాల్స్‌ వివరాలను మధు ప్రియ సైబర్‌ క్రైం పోలీసులకు అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ  509, 354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

మధుప్రియ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతగానో పాపులర్‌ అయ్యింది. తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ ఒక్కసారిగా స్టార్‌ సింగర్‌ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమా పాటలు పాడి ఉర్రూతలూగించింది. ఆమె పాడిన `ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని` అంటూ పాడి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. `ఫిదా` సినిమాలో `వచ్చిండే..మెల్లమెల్లగా వచ్చిండే` పాటతో సినీ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మహేష్‌ హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో `హి ఈజ్‌ సో క్యూట్‌` పాటని మధుప్రియనే పాడటం విశేషం. 

సినీ పాటలు, తెలంగాణ పాటలు,జానపద పాటలు పాడుతూ సింగర్‌గా రాణిస్తుంది మధుప్రియా. అయితే ఆ మధ్య తన ప్రేమ, పెళ్లి వ్యవహరం విషయంలోనూ వార్తల్లో నిలిచింది. వివాదాల్లో ఇరుక్కుంది. దీంతో కాస్త డిస్టర్బ్ అయిన మధుప్రియ అన్ని సమస్యలను అధిగమించి, ఇప్పుడిప్పుడే మళ్లీ తన కెరీర్‌ని పుంజుకునేలా చేస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి