అర్ధరాత్రి హీరోయిన్లతో బాలయ్య చిందులు!

Published : Sep 18, 2018, 05:07 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
అర్ధరాత్రి హీరోయిన్లతో బాలయ్య చిందులు!

సారాంశం

ఆరు పదుల వయసుకి దగ్గరవుతున్నా.. ఇప్పటికీ ముఖానికి రంగేసుకొని అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన దుబాయ్ లో జరిగిన 'సైమా' అవార్డుల వేడుకలో పాల్గొన్నాడు. 

ఆరు పదుల వయసుకి దగ్గరవుతున్నా.. ఇప్పటికీ ముఖానికి రంగేసుకొని అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు. తాజాగా ఆయన దుబాయ్ లో జరిగిన 'సైమా' అవార్డుల వేడుకలో పాల్గొన్నాడు.

ఆ వేడుక పూర్తయిన తరువాత జరిగిన పార్టీలో బాలయ్య చేసిన హడావిడి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రెండు రోజుల పాటు దుబాయిలో జరిగిన ఈ వేడుకలకు బాలయ్యతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేడుకల ముగింపు సందర్భంగా సెలబ్రిటీలందరికీ సైమా నిర్వాహకులు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు.

రాత్రి 12 గంటలకు మొదలైన ఈ పార్టీ ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం. ఈ పార్టీలో పాల్గొన్న బాలయ్య అక్కడ అందరితో కలిసిపోయి సరదాగా జోక్స్ వేసుకొని సమయం గడిపారు. పార్టీ ఎంజాయ్ చేయడంతో పాటు ఆయన డాన్సులు చేయడం ఇప్పుడు హాట్ న్యూస్ అని చెప్పాలి.

ఈ పార్టీలో పాల్గొన్న హీరోయిన్లు శ్రియ, ప్రగ్యాజైస్వాల్, అంజలి వంటి వారితో కలిసి బాలయ్య డాన్స్ చేశారట. బాలయ్య చేసిన హంగామా చూసి తమిళ, కన్నడ హీరోలు ఆశ్చర్యపోయారట. అంటే ఏ రేంజ్ లో ఆయన హడావిడి చేసి ఉంటారో ఊహించుకోవచ్చు!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఫెయిల్యూర్స్ నుంచి బిగ్ బాస్ వరకు, హౌస్ లోకి అడుగుపెట్టిన బోల్డ్ యాంకర్ సుధీర్ రెడ్డి
Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌