
కొన్ని వార్తలు వినటానికే ఆశ్చర్యంగా ఉంటాయి. లేకపోతే ప్రభాస్ సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్స్ దొరక్క పోవటమేమిటి... ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏ సినిమాకు అంటారా....
ఈ మధ్య తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. మహేష్ బాబు పోకిరి సినిమా 4కె రీరిలీజ్ తర్వాత ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. రీరిలీజ్ లో స్టార్ హీరోల చిత్రాలు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. దాంతో హీరోల ఫ్యాన్స్ పోటా పోటీగా తమ రీ రిలీజ్ చిత్రాలను ఆదరిస్తున్నారు. కొన్ని సెలక్టడ్ థియేటర్స్ లో సినిమాని ఒక్క రోజు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. పోకిరి తర్వాత జల్సా రీరిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి మూడు కోట్ల వరకు కలెక్షన్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఖుషి మూవీ రీరిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే కృష్ణ సింహాసనం మూవీని 4కె వెర్షన్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
అలాగే రీసెంట్ గా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రీరిలీజ్ అయ్యి గట్టిగానే హంగామా చేసింది. ఎన్ఠీఆర్ ఆది సినిమాని కూడా రీరిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇలా 15 ఏళ్ళు దాటిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలని మరోసారి తెరపై ప్రదర్శించి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వర్షం సినిమాని కూడా రీరిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని 4కె వెర్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు.
ఇక ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న ఫేమ్ బట్టి నార్త్ ఇండియాలో కూడా సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో వర్షం మూవీ బెస్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత అతనికి స్టార్ ఇమేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలోనే 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రభాస్ వర్షం తెరపై ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఇక ఈ వర్షం రీరిలీజ్ సమయంలో ఆదిపురుష్ టీజర్ ని కూడా థియేటర్స్ లో ప్రదర్శించాలని భావించారు.
ప్రభాస్ పుట్టినరోజు మరో నాలుగురోజుల్లో ఉండడంతో అదే రోజు రిలీజ్ కు ప్లాన్ చేసారు. ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లలో మునిగిపోయారు. కానీ అనుకోని షాక్ తగిలింది ఇప్పుడు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ వారం నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. మంచు విష్ణు 'జిన్నా'తోపాటు ఓరిదేవుడా సర్ధార్ ప్రిన్స్ చిత్రాలు థియేటర్లన్నీ పంచుకుంటున్నాయి. ఇక హాలీవుడ్ ఫేమస్ మూవీ 'ఆడమ్' కోసం మల్లీప్లెక్సుల్లో ఫుల్ డిమాండ్ ఉంది. సిటీల్లో ఈ మూవీ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. దీంతో షోల సంఖ్య పెంచేందుకు యాజమాన్యాలు రెడీ అయిపోయారు. కొత్త సినిమాలను వదిలి ప్రభాస్ పాత సినిమా వర్షంకు థియేటర్లు ఇవ్వడం కష్టమని థియేటర్ యజమానులు డిస్ట్రిబ్యూటర్లు చెప్పారట.. ఒక వారం తర్వాత వర్షం రిలీజ్ చేయాలని కోరుతున్నారని సమాచారం.