
సరోగసి వివాదం చిలికి చిలికి గాలివాన అవుతోంది.. నయనతార - విఘ్నేశ్ శివన్ లు పూర్తిగా ఈ వివాదంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇప్పుడు ఈ వివాదం చిన్మయి చుట్టు చుట్టుకునేలా కనిపిస్తోంది. పెళ్లైన నాలుగు నెలలకే తాము కవలలకు తల్లిదండ్రులయ్యాం అంటూ నయన్ దంపతులు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సరోసగి వివాదం భారీ ఎత్తున నడుస్తోంది. ఈ విషయంలో మంత్రి కూడా వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ వివాదం రగులుతూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సరోసగి విమర్శలు ఎదుర్కొన్నారు.
నయన్ దంపతుల నుంచి ఈ వివాదం చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ దంపతుల వైపు మళ్ళింది. వీరిద్దరు ఈ ఏడాది జూన్లో కవలలకు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకునే చిన్మయి.. తల్లికాబోతున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాంతో అందరికి అనుమానం వచ్చింది. అనుమానం రావడం మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఈ జంట సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులయ్యారంటూ తెలిసీ తెలియకుండా కామెంట్లు చేస్తూ వస్తున్నారు నెటిజన్లు. ఇక రీసెంట్ గా ఈ విషమర్షలపై తనదైన మార్క్ లో స్పందించింది చిన్మయి.
అందరికి బుర్ర తిరిగేలా.. ఈ విమ్రషలపై ఒక్క ఫోటోతో సమాధానం చెప్పింది స్టార్ సింగర్. వీటితోపాటు తన బేబీ బంప్ ఫొటోను సైతం పోస్టుచేశారు. ఇక తన ఇద్దరు పిల్లలకు ఒకేసారి పాలుపడుతున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అందరికి అనుమానం వీడిపోయేలా.. ఈ పిల్లలు తమ పిల్లలే అని నిరూపించేలా... చెప్పకనే చెప్పింది చిన్మయి. తన ఇన్స్టాగ్రామ్ పేజిలో వీడియో, ఫొటోలను షేర్ చేశారు. ఫోటోలు శేర్ చేస్తూ.. ఈ విధంగా రాసుకొచ్చింది చిన్మయి.
32 వారాల తర్వాత నా ఫొటోను మీతో ఇప్పుడే పంచుకుంటున్నాను. వీలైనన్ని ఫొటోలు తీసుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అయితే, దీని వెనకున్న కారణాన్ని ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పాను. మొదటిసారి గర్భస్రావమైన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఆ ఘటన తలచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంటుంది. కడుపుతో ఉన్నా కూడా నా వృత్తి జీవితాన్ని కొనసాగించా. డబ్బింగ్, రికార్డింగ్ సమయాల్లో నా ఫొటోలు, వీడియోలు తీయొద్దని చెప్పాను. నా వ్యక్తి గత జీవితానికి భంగం కలిగించొద్దని వారిని వేడుకున్నాను. అందుకే నేను తల్లైన విషయాన్ని చెప్పకుండా దాచాను అన్నారు చిన్మయి.
ఇక నేను ఫోటోలు పెట్టలేదు.. విషయం చెప్పలేదు అని తనపై సరోగసి అని వస్తున్న ప్రశ్నలకు ఇదే నా సమాధానం. సరోగసి, ఐవీఎఫ్, సహజ గర్భం ఇలా ఏ రూపంలో అయినా పిల్లల్ని కనాలనుకోవడం నా వరకు పెద్ద సమస్య కాదు. అమ్మ అంటే అమ్మ అంతే. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారనుకుంటే నేనేమీ లెక్కచేయను. ఎవరు ఏమనుకున్నా.. అది వాళ్ల అభిప్రాయం. నాకు ఎలాంటి సమస్య లేదు అని తెలిపారు. ఇలా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పింది చిన్మయి శ్రీపాద.