భర్త తిరిగొచ్చిన సంతోషంలో శిల్పా శెట్టి.. ఎలాంటి కామెంట్స్ చేసిందో తెలుసా !

By telugu teamFirst Published Sep 25, 2021, 4:58 PM IST
Highlights

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్ ని కుదిపేసింది. నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాని కొన్ని వారాల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్ ని కుదిపేసింది. నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాని కొన్ని వారాల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా ఆఫీస్ నుంచి పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలో లండన్ వేదికగా వివిధ యాప్స్ కొరకు రాజ్ కుంద్రా ఇండియన్ నటీనటులతో పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనే సంచలన ఆరోపణలు వినిపించాయి. ఈ మొత్తం వ్యవహారం శిల్పా శెట్టికి పరువు సమస్యగా మారింది. ఆమె మానసిక ప్రశాంతతని కోల్పోయింది. 

మీడియాని ఫేస్ చేసేందుకు కూడా ఆమె ధైర్యం చేయలేదు. ఈ నేపథ్యంలో శిల్పా శెట్టి భర్తపై ఆగ్రహంతో ఉందని..ఈ మొత్తం వ్యవహారం ద్వారా వారి మధ్య రిలేషన్ షిప్ దెబ్బతిన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఒక దశలో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి విడిపోతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లుగా శిల్పా శెట్టి నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తూన్యూ ఎండింగ్ పేరుతో ఓ పోస్ట్ పెట్టింది. 

దీనితో అనుమానాలు పెరిగాయి. ఇదిలా ఉండగా శిల్పా శెట్టి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తాము రికవరీ అవుతున్నట్లు శిల్పా శెట్టి పేర్కొంది. రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదలైన తర్వాత శిల్పా శెట్టి ఈ పోస్ట్ పెట్టడం విశేషం. భర్త తిరిగి రాగానే ఆమె బాధ మొత్తం పోయినట్లు ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

కష్టాలు వల్ల మనుషులు బలంగా మారరు..కష్టాల్లో కూడా ధైర్యంగా పని చేస్తే బలంగా మారుతారు అంటూ శిల్పా శెట్టి మోటివేషనల్ పోస్ట్ పెట్టింది. 

click me!