నెగిటివ్ థాట్స్ కంట్రోల్ చేసుకోండి.. భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి శిల్పా శెట్టి

By telugu teamFirst Published Aug 16, 2021, 6:15 PM IST
Highlights

శిల్పా శెట్టికి యోగ, ప్రాణాయామం లాంటి అంశాల్లో మంచి పట్టు ఉంది. 46 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టి చెక్కు చెదరని అందంతో ఉందంటే అందుకు కారణం యోగానే.

తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకోవడంతో శిల్పా శెట్టి కుటుంబం కొన్ని వారాలుగా వార్తల్లో ఉంటోంది. అడల్ట్ కంటెంట్ అంటూ రాజ్ కుంద్రా కొన్ని యాప్స్ కోసం పోర్న్ కంటెంట్ తయారు చేస్తున్నారు అని ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

దీనిపై జాతీయ వ్యాప్తంగా అనేక కథనాలు వెలువడ్డాయి. శిల్పా శెట్టి కూడా ఈ మొత్తం వ్యవహారంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు, మానసిక వేదన అనుభవిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఏది ఏమైనా తన భర్త అరెస్ట్ తర్వాత తొలిసారి శిల్పా శెట్టి కెమెరా ముందుకు వచ్చి అభిమానులకు కనిపించింది. 

కోవిడ్ 19 అవేర్నెస్, ఫండ్ రైజింగ్ ఈవెంట్ 'వి ఫర్ ఇండియా'లో పలువురు బాలీవుడ్ తారలు పాల్గొంటున్నారు. మలైకా అరోరా, అర్జున్ కపూర్, దియా మీర్జా, విద్యా బాలన్ లాంటి సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు. వీరితో పాటు శిల్పా శెట్టి కూడా ఈ వర్చువల్ ఈవెంట్ లో పాల్గొంది. 

శిల్పా శెట్టికి యోగ, ప్రాణాయామం లాంటి అంశాల్లో మంచి పట్టు ఉంది. 46 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టి చెక్కు చెదరని అందంతో ఉందంటే అందుకు కారణం యోగానే. ఒకప్పుడు శిల్పా శెట్టి హాట్ యోగా ఫోజులు ఎలా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. 

తాజాగా శిల్పా శెట్టి వి ఫర్ ఇండియా వర్చువల్ ఈవెంట్ లో కోవిడ్  టైంలో శ్వాస యొక్క ప్రాముఖ్యతని తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం శ్వాసపై ఆధారపడి ఉంది. కేవలం శ్వాస తోనే మీ శరీరం మొత్తాన్ని కాపాడుకోవచ్చు. శ్వాస తీసుకునే సమయంలో మీ బ్రెయిన్ సెల్స్ కి ఆక్సిజన్ అందితే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని శిల్పా శెట్టి తెలిపింది. 

అలాగే నెగిటివ్ థాట్స్ ని ఎలా దూరం చేసుకోవాలో కూడా వివరించింది. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి. అలాగే మీ శ్వాసని అదుపులో ఉంచుకోండి. ప్రాణాయామం చేయడం చాలా ఉత్తమం అని శిల్పా శెట్టి పేర్కొంది. 

 

click me!