శర్వానంద్ చివరగా నటించిన చిత్రం మనమే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7 న విడుదలై నిరాశపరిచింది.
శర్వానంద్ చివరగా నటించిన చిత్రం మనమే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 7 న విడుదలై నిరాశపరిచింది. ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి తల్లిదండ్రులుగా నటించారు.
శర్వానంద్, కృతి శెట్టి నటన ఆకట్టుకుంది. శర్వానంద్ నటనతో ఆకట్టుకుంటునప్పటికీ అతడికి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. కొన్ని చిత్రాలు యావరేజ్ గా ఆడుతున్నాయి. పీపుల్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎక్కువ భాగం విదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఫలితంగా తెలుగు ఆడియన్స్ కి ఈ చిత్రంలో ఎమోషన్స్ కనెక్ట్ కాలేదు.
ఏది ఏమైనా ఈ చిత్రం విడుదలై నెలరోజులు గడచిపోయింది. ఇక ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చే సమయం ఆసన్నం అయింది. ఈ చిత్ర ఓటిటి రిలీజ్ కి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. జూలై 12 నుంచి ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ.. జూలై 12 నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రంలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదే కనుక జరిగితే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి చూస్తారు. థియేటర్స్ లో ఆదరణ లభించిన కొన్ని యావరేజ్ చిత్రాలు ఓటిటిలో అదరగొడుతున్నాయి. మనమే చిత్రానికి ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ ఉంటుంది అని అంతా అంచనా వేస్తున్నారు.