
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ వందల కోట్ల ఆస్తులకు అధిపతి. ఆయన హీరోగా ఎంతో సంపాదించాడు. అనేక లగ్జరీ బంగ్లాలు, కార్లు, ఇతర ఆస్తులున్నాయి. కానీ తన కూతురు సుహానా ఖాన్ ఇప్పుడు పెద్ద షాకిచ్చింది. భారీ ఆస్తులు కూడబెట్టి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు తన తొలి సంపాదనతో కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేయడం విశేషం. ఆమె మహారాష్ట్రలోని అలీబాగ్లో భారీ విలువైన ప్రాపర్టీలను కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
సుహానా ఖాన్ తన తొలి సంపాదనతో రూ.12.91కోట్లతో ఆస్తులను కొనుగోలు చేసిందట. ఇది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అందులో భాగంగా సుహానా ఖాన్ మూడు ఇళ్లతోపాటు, ఒక ప్లాట్ని కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. రిజిస్ట్రేషన్లో సుహానా పేరుని రైతుగా నమోదు చేశారని తెలుస్తుంది. సుహానా అమ్మమ్మ సవితా ఛిబ్బర్, ఆమె సోదరి నమితా చిబ్బర్ డైరెక్టర్లుగా ఉన్న డెజా వు ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ ఆస్తిని జూన్ 1న రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.
ఈ ఆస్తుల్లో.. ఎకరంన్నర భూమి, 2218 చదరపు అడుగుల్లో ఒక ఇళ్లు ఉంది. దీనికోసం 77 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు సుహానా. ఇక సుహానా ఖాన్ కొనుగోలు చేసిన అలీబాగ్లో షారూఖ్ కి ఓ లగ్జరీ బంగ్లా ఉంది. అలాగే అక్కడ బాలీవుడ్ స్టార్లు రణ్ వీర్ దీపికా పదుకొనె జంట, విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ వంటి సెలబ్రిటీల ఇళ్లు ఉండటం విశేషం.
ఇదిలా ఉంటే సుహానా ఖాన్ నటిగా తెరంగేట్రం చేస్తుంది. ఆమె జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన `ది అర్చీస్` అనే సినిమాలో నటిస్తుంది. `ది అర్చీస్` అనేది 1960ల నాటి భారతదేశంలోని లైవ్ యాక్షన్ మ్యూజికల్ సెట్. ఈ సినిమాలో బోనీ కపూర్ రెండో కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఏడాది విడుదల కానుంది. సుహానా ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ ఇంటర్నెట్లో వేడిపెంచుతుంటుంది. సినిమాల్లోకి రాకముందే గ్లామర్ డోస్తో పిచ్చెక్కిస్తుంది. ఇక సినిమాల్లోకి వచ్చాక ఏ రేంజ్లో రెచ్చిపోతుందో చూడాలి.