హిందీ చాలా బాగుంటుంది అంటూ వ్యాఖ్యలు : ఆ భాషలోనే సినిమాలు చేసుకో, సుహాసినిపై నెటిజన్ల ఫైర్

Siva Kodati |  
Published : May 03, 2022, 08:46 PM IST
హిందీ చాలా బాగుంటుంది అంటూ వ్యాఖ్యలు :  ఆ భాషలోనే సినిమాలు చేసుకో, సుహాసినిపై నెటిజన్ల ఫైర్

సారాంశం

అజయ్ దేవగణ్- కిచ్చా సుదీప్‌ల మధ్య కొద్దిరోజులుగా హిందీ భాషపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదంలోకి సీనియర్ నటి సుహాసిని చేరారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. 

హిందీ – తమిళ్ భాషల గురించి ఉత్తరాది, దక్షిణాది భాషల నటులు, రాజకీయ నాయకుల మధ్య ప్రస్తుతం చిన్నపాటి వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ వివాదంలోకి సీనియర్ నటి, ప్రముఖ దర్శకుడు మణిరత్నం (maniratnam) సతీమణి సుహాసిని (suhasini maniratnam0 ఎంటరయ్యారు. నటులకు భాషల అంతరంపై ఆమె రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో స్పందించారు.    

నటులు అన్న తర్వాత అన్ని భాషలూ నేర్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. హిందీ భాష చాలా బాగుంటుందని.. అదికూడా నేర్చుకోవాలి హితవు పలికారు. హిందీ వాళ్లు చాలా మంచివాళ్లని.. అలాగే హిందీ వాళ్లు కూడా తమిళం నేర్చుకోవాలని సుహాసినీ సూచించారు. ఇలా అందరూ కలిసిమెలిసి ఉంటే సంతోషంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తన ఇంట్లో పనిచేసే వాళ్లలో తెలుగుతో పాటు హిందీ మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారని సుహాసిని చెప్పారు. ఈ భాషే కావాలని మొండికేస్తే మనకు తినడానికి తిండి కూడా దొరకదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో సుహాసినిని తమిళ ప్రజలు ట్రోల్ చేస్తున్నారని... హిందీ కావాలనిపిస్తే ఆ భాషలోనే సినిమాలు చేసుకో అంటూ సెటైర్లు వేస్తున్నారు.

కన్నడ హీరో కిచ్చ సుదీప్ (kiccha sudeep) , అజయ్ దేవగణ్ (ajay devgan) మధ్య జరుగుతున్నలాగ్వేజ్ ట్విట్ వార్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ టాపిక్ మధ్యలోకి రాజకీయాలు కూడా వచ్చి చేరాయి. ఇక ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ కూడా డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఆకరికి ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన మార్క్ స్పందన ఇచ్చారు.  ఇక అందరూ ఎదురుచూస్తున్న బాలీవుడ్ కాంట్రవర్సియల్ కింగ్ కంగనా రనౌత్ స్పందన రానే వచ్చింది. ఇంతకీ ఆమె ఏమన్నదంటే.
 
కాగా.. హిందీ జాతీయ భాష అనే అంశం మీద సుధీన్, అజయ్ దేవగణ్ ఈ ఇద్దరు స్టార్ల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఇండైరెక్ట్‌గా సెటైర్లు కూడా వేసుకుంటూ.. వరుస ట్వీట్ లు చేసుకున్నారు హీరోలు. ఇక తాజాగా ఈ గొడవ మధ్యలో వివాదాల హీరోయిన్  కంగనా రనౌత్ కూడా దూరిపోయింది. ఇక కంగనా  సీన్ లోకి ఎంటర్ అయితే మామూలుగా ఉండదు కదా.. అందరూ ఒకటి అంటే ఆమె మరోకటి అంటుంది. ఈ విషయంలో కూడా కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది కంగనా.  

ఏదో ఒక స్టాండ్ తీసుకుని అవతలి వారిని ఏకి పడేస్తుంటుంది కంగనా రనౌత్ లేకపోతే  తన మార్క్ సెటైలర్లతో సందడి చేస్తుంది.  ఇక కాంట్రవర్సి క్వీన్ కంగనా కాలుమోపడంతో వివాదం వేరే టర్న్ తీసుకుంది. సుధీప్, అజయ్ దేవగణ్ మధ్య హిందీ విషయంలో రచ్చ జరగటంతో మీడియా కంగనాని కూడా కదిపింది. హిందీ జాతీయ భాష సంగతి ఏంటని అడిగింది. దానికి కాస్త భిన్నంగా స్పందించిన రనౌత్, సంస్కృతం మన జాతీయ భాష కావాలని అభిప్రాయపడింది. 

అంతే కాదు, కన్నడ, తమిళం, గుజరాతీ, హిందీ కంటే కూడా సంస్కృతం పురాతనమైందని ఆమె అభిప్రాయపడింది. పైగా భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చాయని కంగనా విశ్లేషించింది. కాబట్టి మనందరికి దేవభాషైన సంస్కృతం కంటే మరేది జాతీయ భాషగా ఉండటానికి తగింది కాదని ఆమె చెప్పేసింది. హిందీ జాతీయ భాష కాదని వివాదం స్టార్ట్ చేశాడు  కన్నడ స్టార్ సుధీప్. అందుకు రివర్స్ కౌంటర్ ఇస్తూ.. హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు. ఇది  పెద్ద చర్చకి దారి తీసింది. ఆ నేపథ్యంలోనే కంగనా సంస్కృతాన్ని ముందుకు తీసుకు వచ్చింది. అయితే, ఆమె కన్నడ, తమిళం వంటి దక్షిణాది భాషలకంటే సంస్కృతం పురాతనం అనటం... ఇక్కడి వారు ఎలా స్వీకరిస్తారో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే