స్టార్ హీరో కొడుకుతో సాయి పల్లవి!

First Published Aug 7, 2018, 5:44 PM IST
Highlights

తాజాగా సాయిపల్లవికి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తూ విజయాలు అందుకోవడం శేఖర్ కమ్ముల స్టైల్. 'అనామిక' సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు గతేడాది 'ఫిదా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వరుణ్ తేజ్ కి నటుడిగా మంచి గుర్తింపుని తీసుకురాగా తెలుగు తెరకు సాయి పల్లవి అనే అద్భుత నటిని పరిచయం చేసింది.

ఈ సినిమా తరువాత సాయి పల్లవి కెరీర్ తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ సరసన 'పడి పడి లేచే మనసు' అనే సినిమాలో నటిస్తోంది. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సాయిపల్లవికి మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయిపల్లవిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అక్టోబర్ నెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

click me!