ఇప్పుడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ ట్రైలర్ ని మీరూ ఓ లుక్కేయండి.
సత్యదేవ్, నిత్యామేనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కైల్యాబ్’. విశ్వక్ ఖండేరావు తెరకెక్కించారు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పబ్లిసిటీ ని పెంచేసారు. ఇందులో భాగంగా నవంబర్ 1న ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఫన్నీగా ఉండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ ట్రైలర్ ని మీరూ ఓ లుక్కేయండి.
విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు హీరో సత్యదేవ్. సత్యదేవ్ హీరోగా చేస్తూండటంతోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్కై ల్యాబ్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ స్కైలాబ్ భూమిపై పడుతుందని.. మొత్తం ప్రపంచం నాశనమైపోతుందని అపట్లో వార్తలు వచ్చాయి.
‘‘1979లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, ప్రపంచం నాశనమై పోతుందని వార్తలొచ్చాయి. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైల్యాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఈ చిత్ర కథాంశం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, ఛాయాగ్రహణం: ఆదిత్య జవ్వాది.