సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’.
సమంతా ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు అనుకోకుండా 20 ఏళ్ల వయసున్న యువతి మారిపోతే ఎలా ఉంటుందనే చిన్న ఐడియాతో ఈ మూవీ వస్తోంది. ఈ సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.
సమంత ను కొత్త అవతార్ లో కనపడుతున్న ఈ టీజర్ లో మంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. `ఓబేబి` టీజర్ లో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి కూడా ఉన్నారు. షూటింగ్ అంతా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్సాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే... మజిలీతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సమంత ఈ సినిమాతో మరో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు.