అక్కినేని నాగచైతన్య - సమంత టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ అని చెప్పాలి. ఓ వైపు కెరీర్ ను సెట్ చేసుకుంటూనే ప్రేమ తీపిని చూసి ఒకరినొకరు అర్ధం చేసుకొని అరుదైన పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది ఇదే రోజు పెళ్లి బంధంతో ఈ కపుల్స్ ఒక్కటైన సంగతి తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య - సమంత టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ అని చెప్పాలి. ఓ వైపు కెరీర్ ను సెట్ చేసుకుంటూనే ప్రేమ తీపిని చూసి ఒకరినొకరు అర్ధం చేసుకొని అరుదైన పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది ఇదే రోజు పెళ్లి బంధంతో ఈ కపుల్స్ ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాలను ఒప్పించి రెండు సంప్రదాయాలకు గౌరవం తెచ్చేలా వివాహం చేసుకున్న ఈ జంట అందరిని ఆకర్షించింది.
ఫస్ట్ యానివర్సరీ కావడంతో అక్కినేని కపుల్స్ మొన్నటివరకు హాలిడేస్ లో ఉన్నారు. సినిమాకు సంబందించిన పనులను వారం ముందే ఫినిష్ చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లారు. రీసెంట్ గా ట్రిప్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్న సమంత విషెష్ చెప్పిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా వారి అనుబంధం గురించి అభిమానులతో పంచుకున్నారు.
నాలో భాగమైన చైకి పెళ్లిరోజు శుభాకాంక్షలు. నిన్ను చుస్తే గర్వంగా ఉంటుంది. ఈ గొప్ప రోజును ఎప్పటికి మర్చిపోలేను. మాకు విషెష్ చెప్పిన అందరికి థ్యాంక్స్. నిత్యం తమపై ప్రేమానురాగాలు చూపిస్తున్న వారికి కృతజ్ఞులుగా ఉంటాం అని సమంత వివరించింది.