మజిలీ, రంగస్థలం చిత్రాలని గుర్తు చేసుకున్న సమంత.. శుభం మూవీ వేరే లెవల్ అంటూ కామెంట్స్

స్టార్ హీరోయిన్ సమంత సొంత బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థను స్థాపించి అందులో తొలిసారి నిర్మించిన చిత్రం శుభం. సమంత తొలిసారి నిర్మాత అవతారం ఎత్తడంతో శుభం చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

Google News Follow Us

స్టార్ హీరోయిన్ సమంత సొంత బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థను స్థాపించి అందులో తొలిసారి నిర్మించిన చిత్రం శుభం. సమంత తొలిసారి నిర్మాత అవతారం ఎత్తడంతో శుభం చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మే 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి లాంటి నటీనటులు ఈ చిత్రంలో నటించారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ నేడు వైజాగ్ లో గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత ప్రసంగం సింపుల్ గా ఉంటూ ఆకట్టుకుంది.

తనకి వైజాగ్ రాగానే ఇక్కడ షూటింగ్ చేసిన చిత్రాలు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రాలు గుర్తుకు వస్తున్నాయని పేర్కొంది. మజిలీ, ఓ బేబీ, రంగస్థలం లాంటి చిత్రాలన్నీ తనకి గుర్తొస్తున్నాయని అభిమానులకు తెలిపింది. వైజాగ్ వస్తే సినిమా బ్లాక్ బస్టర్. అంటే శుభం చిత్రాన్ని కూడా బ్లాక్ బస్టర్ చేస్తారు కదా అని ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడింది. ఏ మాయ చేసావే చిత్రం తర్వాత తనకి ఎంత క్రేజ్ వచ్చింది, అభిమానులు నా గురించి మాట్లాడుకుంటున్నారా ఇలాంటి విషయాలు ఏమీ తెలియదు.

కానీ ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఒకసారి వైజాగ్ కి వచ్చాను. అప్పుడు వైజాగ్ లో అభిమానులు చూపించిన ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేను అని సమంత తెలిపింది. శుభం చిత్రం విషయానికొస్తే.. ఈ మూవీ మిమ్మల్ని నిరాశపరచదు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతో వస్తారు. ఆ విషయంలో మీకు నేను హామీ ఇస్తున్న అని సమంత పేర్కొంది. ట్రైలర్ చూసినప్పుడు మీకు ఈ చిత్రం హారర్ కామిడీ అని అనిపించొచ్చు. కానీ ఈ సినిమా అసలు కథ వేరే అంటూ సమంత ఉత్కంఠ పెంచేసింది.

 

 

Read more Articles on
click me!