పోగొట్టుకున్న ఆ ఆనందం అంత త్వరగా రాదని తెలుసు.. కానీ, వీలైనంత త్వరగా ఆ ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది.
నాగ చైతన్యతో వివాహబంధానికి స్వస్తి చెప్పిన సమంత నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. చైతూ తో విడిపోయాక కొంత గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో తిరిగి ఫుల్ యాక్టివ్ అయిన సామ్.. ప్రతి రోజు కొత్త పోస్ట్ పెడుతూ జనాల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నెన్నో భావోద్వేగభరితమైన పోస్టులు పెట్టింది.ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్స్టా వాల్పైచేసిన పోస్ట్ అందులోని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరోసారి సమంత భావోద్వేగానికి లోనైంది. ఇన్ స్టా స్టేటస్ లో ఓ పోస్ట్ ను పెట్టింది. దీపావళి పర్వదినాన్ని ఆమె తన స్నేహితురాలైన శిల్పారెడ్డి ఫ్యామిలీతో కలిసి చేసుకుంది. ఆ ఫొటోలనూ పోస్ట్ చేసింది. ‘‘ఈ ఏడాది దీపాలు పెట్టని ఇళ్లు.. తీపి రుచి ఎరుగని కుటుంబాలు.. ఏడాది మొదట్లోనే పోగొట్టుకున్న సంతోషాలు.. ఇవన్నీ ఇప్పుడు ప్రతి సందర్భాన్ని చిన్నగానే చూపిస్తున్నాయి.
పోగొట్టుకున్న ఆ ఆనందం అంత త్వరగా రాదని తెలుసు.. కానీ, వీలైనంత త్వరగా ఆ ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను’’ అంటూ పోస్ట్ పెట్టింది. అలాగే అంతకన్నా ముందు.. ‘‘ఆనందానికి మించిన ధనం లేదు.. మన:శాంతికి మించిన విజయం లేదు.. ఆరోగ్యానికి మించిన మహాభాగ్యం లేదు.. దయాగుణానికి మించిన సంతృప్తి ఉండదు’’ అంటూ స్టేటస్ పెట్టింది.
ఇక మెగా కుటుంబ సభ్యులు ఇటీవల దీపావళి సందర్భంగా ఒకే చోట పండుగ జరుపుకున్న విషయం తెలిసిందే. 'హ్యాపీ దీపావళి' అంటూ సినీనటుడు అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఓ ఫొటో బాగా వైరల్ అయింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా పాల్గొంది. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. మెగా కుటుంబ సభ్యులు పండుగ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో సమంత కనపడుతోంది. రెండు రోజుల పాటు మెగా కుటుంబం ఈ వేడుకలు జరుపుకుంది. అల్లు అర్జున్తో పాటు రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక, ఉపాసన, చైతన్య తో పాటు పలువురు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాసనతో సమంత ఫొటో దిగింది.