తన వయసు గురించి దిశా పటానీ చేసిన కామెంట్స్ పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మండిపడ్డారు.
తన వయసు గురించి దిశా పటానీ చేసిన కామెంట్స్ పై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మండిపడ్డారు. సల్మాన్ నటించిన 'భారత్' సినిమాలో కత్రినా, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిశా.. సల్మాన్ వయసుపై కామెంట్స్ చేసింది.
భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయకపోవచ్చని, వయసు రీత్యా ఆయన తనకంటే ఎంతో పెద్దవాడని చెప్పింది. ఈ సినిమాలో సల్మాన్ కి పాతికేళ్ల వయసు ఉన్న సమయంలో ఆయన సరసన కనిపిస్తానని, అలా అన్ని సినిమాలకు కుదరదు కాబట్టి ఆయనతో కలిసి పనిచేయకపోవచ్చని కామెంట్స్ చేసింది.
ఈ కామెంట్స్ విన్న సల్మాన్ నొచ్చుకున్నారు. 'భవిష్యత్తులో దిశా నాతో కలిసి పనిచేయదా..? ఎందుకలా..? వయసు గురించి ఆమె అలా ఎలా మాట్లాడుతోంది..? నేనేమైనా మైనర్ తో కలిసి సినిమాలు చేస్తున్నానా..?' అంటూ మండిపడ్డారు. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.