`సలార్‌` స్టోరీ లీక్‌ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ పాత్రలివే?

By Aithagoni RajuFirst Published Nov 29, 2023, 9:34 AM IST
Highlights

ప్రభాస్‌ హీరోగానటిస్తున్న `సలార్‌` మూవీ కథపై ఇప్పటి వరకు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్పందించారు. అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు.

టాలీవుడ్‌ నుంచి ఇప్పుడు ఇండియా మొత్తం `సలార్‌` సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ నటించిన మూవీ కావడం ఓ కారణం అయితే, `కేజీఎఫ్‌` వంటి సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నుంచి వస్తోన్న మూవీ కావడం మరో కారణం. ఇందులో ప్రభాస్‌ పూర్తి మాస్‌ రోల్‌ చేయడం మరో విశేషం. ఇప్పటి వరకు కనిపించనటువంటి పాత్రలో డార్లింగ్‌ కనిపించబోతున్నారు. `సలార్‌`గా ఆయన రచ్చ చేయబోతున్నారు. 

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ గూస్‌ బంమ్స్ తెప్పించేలా ఉంది. ఇందులో కనీసం ప్రభాస్‌ ఫేస్‌ కూడా సరిగా కనిపించలేదు. కానీ ఎలివేషన్లు, ప్రభాస్‌ చేసే యాక్షన్‌, రణభూమిలో ప్రత్యర్థులను ఊచకోత కోయడం వంటి సీన్లు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. దీనికితోడు మొదట్లో ప్రభాస్‌ పాత్ర గురించి డైనోసార్‌ అంటూ ఇచ్చిన ఎలివేషన్‌ మరింత హైలైట్‌గా నిలిచింది. దీంతో బాక్సాఫీసు డైనోసార్‌ రాబోతుందని అంతా వెయిట్‌ చేస్తున్నారు. 

Latest Videos

ఇదిలా ఉంటే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు. ఆయన ఓ ఇంగ్లీష్‌ మీడియాతో ముచ్చటిస్తూ `సలార్` స్టోరీ లీక్‌ చేశారు. సింపుల్‌గా ఒక్క లైన్‌లో ఆయన కథేంటో చెప్పారు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కథ అన్నారు. అయితే స్నేహితులు అతి పెద్ద శతృవులుగా ఎలా మారారు? ఎందుకు మారారు? ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగే ఫైటే ఈ సినిమా కథ అని చెప్పారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. సినిమాలో ఫ్రెండ్‌షిప్‌ కోర్ పాయింట్‌ అని తెలిపారు. ఈ కథని చెప్పడానికి ఒక పార్ట్ సరిపోవడం లేదని, అందుకే రెండు పార్ట్ లుగా చెప్పబోతున్నట్టు తెలిపారు. సినిమా చాలా లావిష్‌గా ఉంటుందన్నారు. 

తాను ఏ కథ రాసినా అందులో భావోద్వేగాలకు పెద్ద పీఠ వేస్తానని తెలిపారు. రిలేషన్స్, తల్లి, తండ్రి ఎమోషన్స్ ని చూపిస్తానని, ఆతర్వాతే యాక్షన్‌లోకి దిగుతానని తెలిపారు ప్రశాంత్‌ నీల్. సలార్ కూడా అలానే ఉంటుందని చెప్పారు. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `సలార్ః సీజ్‌ ఫైర్‌` చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమార్‌ నెగటివ్‌రోల్‌ చేస్తున్నారు. సలార్‌గా ప్రభాస్‌ కనిపిస్తే, వరదరాజా మన్నార్‌గా పృథ్వీరాజ్‌ కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు మొదట స్నేహితులు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవతో శతృవులుగా మారతారని, ఇద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా అని తెలుస్తుంది. ఇందులో రాజమన్నార్‌గా జగపతిబాబు కనిపిస్తారు. తన కొడుకుగా పృథ్వీరాజ్‌ కనిపించబోతున్నారు. ఇక శృతి హాసన్‌.. హీరోయిన్‌గా చేస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ కానుకగా విడుదల కాబోతుంది. డిసెంబర్‌ 1న సాయంత్రం `సలార్‌` ట్రైలర్‌ రాబోతుంది. 
 

click me!