తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

`యానిమల్‌` మూవీ `అర్జున్‌ రెడ్డి`కి సీక్వెల్‌?.. సందీప్‌రెడ్డి వంగా ఇలా దొరికిపోయాడేంటి?

Aithagoni Raju | Published : Nov 29, 2023 8:40 AM

 సందీప్‌ రెడ్డి వంగా `యానిమల్‌` చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాంకర్‌.. ఇది `అర్జున్‌రెడ్డి`కి సీక్వెలా? అని ప్రశ్నించగా,..


`యానిమల్‌` మూవీ గురించి ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటుంది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ఈ మూవీ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. టీజర్‌తోనే ఝలక్ ఇచ్చిన ఆయన ట్రైలర్ తో గూస్‌బంమ్స్ తెప్పించాడు. ఇదేం సినిమారా బాబూ అనిపించేలా చేస్తుంది. ఏకంగా మహేష్‌బాబు సైతం ట్రైలర్‌ చూడగానే మెంటల్‌ ఎక్కిపోయింది. జస్ట్ మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. మరోవైపు దర్శకధీరుడు రాజమౌళి సైతం ప్రశంసలతో ముంచెత్తారు. ఇండస్ట్రీని, ఆడియెన్స్ షేక్‌ చేసే దర్శకులు అరుదుగా వస్తారని, ఒకప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ, ఇప్పుడు సందీప్‌ రెడ్డి వంగా అంటూ ఆయన కితాబిచ్చాడు. 

ఈ క్రమంలో సందీప్‌ రెడ్డి వంగా `యానిమల్‌` చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాంకర్‌.. ఇది `అర్జున్‌రెడ్డి`కి సీక్వెలా? అని ప్రశ్నించగా, కాసేపు సమాధానం చెప్పలేకపోయాడు సందీప్‌. అవునా, అలా అనిపిస్తుందా? అంటూ కొంత ఆలోచనలో పడ్డారు. ఏమో అండి నాకు అలా అనిపించడం లేదు, మీకు అలా అనిపిస్తుందా?, టీజర్‌, ట్రైలర్, పాటలు ఇలా ఏది చూసినా అలానే అనిపించిందా? అంటూ కవర్‌ చేసే ప్రయత్నం చేశారు. యాంకర్‌ అవునూ అని చెప్పడం విశేషం. 

ఇదే కాదు మరో ఇంటర్వ్యూలోనూ ఇలాంటి ప్రశ్ననే ఎదురయ్యింది. `అర్జున్‌రెడ్డి`లో హీరో లవర్‌ మీద ఎక్స్ ట్రీమ్‌గా లవ్‌, ఎమోషన్‌ని ఎక్స్ ప్రెస్‌ చేశాడు, ఇందులో తండ్రి ప్రేమ మీద ఎక్స్ ట్రీమ్‌గా ప్రేమని, భావోద్వేగాలను ఎక్స్ ప్రెస్‌ చేశాడని యాంకర్‌ చెప్పగా, అందుకు సందీప్‌ రెడ్డి వంగా అలా అనిపిస్తుందా? అంటూ సమాధానం చెప్పలేక ఆగిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఇది `అర్జున్‌రెడ్డి`కి సీక్వెల్‌ అనే అనుమానాలు కలుగుతున్నాయి. `అర్జున్‌రెడ్డి`కి పెళ్లైతే, ఆ తర్వాత తండ్రి ప్రేమ కోసం అతను పడే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందనేలా సినిమా ఉందని అంటున్నారు. దీనిపై మాత్రం దర్శకుడు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిజం ఏంటనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. 

రణ్‌ బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `యానిమల్‌` మూవీని సందీప్‌రెడ్డి వంగా రూపొందించారు. భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రూపొందింది. డిసెంబర్‌ 1న ఈ మూవీ విడుదల కాబోతుంది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!