వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సాయి తేజ్ చిత్రలహరి చిత్రంతో కాస్త ఒడ్డున పడినట్లే కనపడుతున్నాడు. ఈ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నాడు. సక్సెస్ కోసం సెంటిమెంట్లను కూడా ఫాలో అయ్యాడు. తన పేరును సాయి తేజ్ అని వేసుకున్నాడు ఈ మెగా హీరో. ఏప్రియల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గత చిత్రాల కన్నా కలెక్షన్స్ వైజ్ గా మేలనిపించింది.
వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సాయి తేజ్ చిత్రలహరి చిత్రంతో కాస్త ఒడ్డున పడినట్లే కనపడుతున్నాడు. ఈ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నాడు. సక్సెస్ కోసం సెంటిమెంట్లను కూడా ఫాలో అయ్యాడు. తన పేరును సాయి తేజ్ అని వేసుకున్నాడు ఈ మెగా హీరో. ఏప్రియల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గత చిత్రాల కన్నా కలెక్షన్స్ వైజ్ గా మేలనిపించింది.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఎమోషన్స్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమ భాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ పూర్తి చేసుకుంది. 14.57 కోట్లు వరకూ కలెక్షన్స్ రాబట్టింది. గుంటూరు, కృష్ణా మినహా అన్ని చోట్లా ఈ సినిమా లాభాలు తెచ్చి పెట్టింది. సాయి కెరీర్ లో ఎబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది.
ఏరియా వైజ్ కలెక్షన్స్ బ్రేకప్ ..
నైజాం.................... రూ8.6కోట్లు
సీడెడ్..................... రూ.2.18కోట్లు
కృష్ణా...................... రూ.0.82కోట్లు
గుంటూరు.............. రూ.0.98కోట్లు
నెల్లూరు................ రూ.0.50కోట్లు
వెస్ట్....................... రూ.0.78 కోట్లు
ఈస్ట్...................... రూ1.01 కోట్లు
ఉత్తరాంధ్ర........... రూ.1.90 కోట్లు
టోటల్ ఆంధ్రా/తెలంగాణా...... 12.57 కోట్లు
భారత్ లో మిగతా ప్రాంత్రాలు... 1.0 కోట్లు
ఓవర్ సీస్............................... 1.0 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా................... 14.57 కోట్లు
కెరీర్లో సక్సెస్అన్నదే లేని ఓ యువకుడు...ఎలా సక్సెస్ కు చిరునామాగా మారాడనే కథ చిత్రలహరి. సాయి ధరమ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్లు హీరోయిన్లుగా నటించిన ఈసినిమాలో సునీల్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.