హాస్పిటల్ లో జాయిన్ అయిన 'సాహో' డైరెక్టర్ సుజీత్!

By AN TeluguFirst Published Sep 8, 2019, 12:41 PM IST
Highlights

కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ కి డెంగూ ఎటాక్ అయిందని గుర్తించడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 
 

యంగ్ డైరెక్టర్ సుజీత్ శనివారం నాడు హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సుజీత్ కి డెంగూ ఎటాక్ అయిందని గుర్తించడంతో వెంటనే ఆయనను హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

డెంగూ అని తెలిసిన తరువాత కూడా మొదటి రెండు రోజులు ఇంట్లోనే తన తల్లి సంరక్షణలో మెడిసిన్ తీసుకున్నారట. కానీ శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది.

'సాహో' సినిమాకి వచ్చిన విమర్శలు కూడా ఆయన భరించలేకపోయారని.. సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయ్యారని సమాచారం. 'సాహో' సినిమా విషయంలో సుజీత్ ని పెర్సనల్ గా ఎటాక్ చేయడం, కామెంట్స్ చేయడం వంటి విషయాలు తనను మరింత ఒత్తిడికి గురి చేశాయని సుజీత్ సన్నిహితులు చెబుతున్నారు. 

click me!