బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తను నటించిన 22 చిత్రాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను ఓ టీవీ ఛానెల్ కి అమ్మినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తను నటించిన 22 చిత్రాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను ఓ టీవీ ఛానెల్ కి అమ్మినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన రెండు వందల కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
వీటిల్లో 'స్వదేశ్', 'ఓం శాంతి ఓం', 'దిల్ వాలే', 'చెన్నై ఎక్స్ ప్రెస్' వంటి సినిమాలు ఉన్నాయి. షారుఖ్ కొన్నాళ్లుగా హీరోగా నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ చిత్రాలుగా మిగిలిపోయాయి. దీంతో షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ కి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో షారుఖ్ తన వద్ద ఉన్న సినిమాల శాటిలైట్ హక్కులను అమ్మాలని నిర్ణయించుకున్నాడట. ఆ విధంగా దాదాపు రెండు వందల కోట్లు తన అకౌంట్ లో వేసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం షారుఖ్ ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఇటీవల ఆయన ఐపీఎల్ మ్యాచ్ ని దర్శకుడు అట్లీతో కలిసి చూడడంతో ఇద్దరు కలిసి సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు.