ఈ షెడ్యూల్తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ...
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja),హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో తెలిసిందే. ధమాకా తర్వాత రవితేజ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వర్కవుట్ కావటం లేదు. ఈ సారి పెద్ద హిట్ కొట్టాలని కసిగా ఉన్న రవితేజ బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ రీమేక్ తో వస్తున్నారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రవితేజ కాంబినేషన్ లో గతంలో వచ్చిన మిరపకాయని మించి సినిమా ఉంటుందని చెప్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమా టైటిల్ కూడా జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ నేపధ్యంలో చిత్రం రిలీజ్ ఎప్పుడు ఉండవచ్చు అనేది ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం జూలై 2024 రెండవ వారంలో రిలీజ్ కానుంది. జూన్ కి అన్ని పనులు పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నారు. షూటింగ్ షెడ్యూల్ ప్రకారం లక్నోలో షూట్ మొదలు కానుంది. త్వరలోనే రవితేజ సెట్స్లో జాయిన్ కాబోతున్నారు. లక్నోలో కీలక సీన్స్ షూట్ చేయనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో 50 శాతం సినిమా పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్లో రవితేజ తన ఫేవరేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ పోజ్లో కనిపిస్తూ ఫ్యాన్స్ని అలరించారు.
‘మిస్టర్ బచ్చన్..నామ్ తో సునా హోగా’ అని రవితేజ చెప్పిన డైలాగ్తో ఈ సినిమా గ్రాండ్గా లాంఛ అయింది. రవితేజ కథానుగుణంగా అమితాబ్బచ్చన్ అభిమానిగా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రానికి కెమెరా: ఆయనంక బోస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన-దర్శకత్వం: హరీశ్ శంకర్.