గెస్ట్ రోల్ లో రష్మిక,ఐరనే వంచాలా ఏంటి?

By Surya PrakashFirst Published Dec 3, 2023, 12:24 PM IST
Highlights

ఢిల్లీ నైట్ షూట్‍కు అవసరమైనవి. సమ్‍థింగ్ స్పెషల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో చెబుతా” అని రష్మిక తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీకి క్యాప్షన్ రాశారు.


యానిమల్ సూపర్ హిట్ తో రష్మిక మంచి ఊపు మీద ఉంది.  రష్మిక మందన్న ఈ సినిమాలో  చాలా  బోల్డ్‌గా నటించింది. ఇంతకు ముందు ఎప్పుడూ నటించనంత బోల్డ్ గా రష్మిక ఈ సినిమాలో కనిపించింది.  ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ఉన్నా... ‘యానిమల్’ సినిమాలో చాలా హాట్ అవతార్‌లో నటించింది. కుర్రాళ్లకు ఆమె హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమె పోస్టర్ మీద కనపడితే సినిమాకు వెళ్లిపోయాలా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆమె ఓ సినిమా స్పెషల్ కామియో రోల్ లో కనిపించబోతోందని సమాచారం. అదీ.. ఓ స్పెషల్‌ సాంగ్‌లో అని రీసెంట్ గా షూటింగ్ జరిగిందని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏమిటీ అంటే...

విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’.ఫ్యామిలీ చిత్రాలు డైరక్ట్ చేసి సూపర్ హిట్స్ ఇచ్చే పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక కనపడబోతోంది. అయితే అది కొద్ది సేపే. కథలోని ఓ ప్రత్యేక సందర్భంలో ఓ పాట వస్తుందని సమాచారం. షూటింగ్ స్పాట్ నుంచి ఈ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. ఫ్యామిలీ స్టార్ నైట్ షూట్ అంటూ రాసుకొచ్చారు. అయితే, రష్మిక మందన్న కూడా అదే షూటింగ్ లొకేషన్‍కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. “ఢిల్లీ నైట్ షూట్‍కు అవసరమైనవి. సమ్‍థింగ్ స్పెషల్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో చెబుతా” అని రష్మిక తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీకి క్యాప్షన్ రాశారు.

Latest Videos

విజయ్‌ దేవరకొండ, రష్మికలది విజయవంతమైన కాంబినేషన్. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాల్లో జోడీ కట్టి హిట్ కొట్టారు. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాలో రష్మికనే హీరోయిన్ గా ఎంచుకొందామనుకొన్నారు. కానీ కాల్షీట్ల సమస్యతో కుదర్లేదు. కనీసం ఓ పాటతో అయినా ‘గీత గోవిందం’ కాంబోని ఇలా రిపీట్‌ చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన అని చెప్తున్నారు. సినిమాకు క్రేజ్ రావాలంటే ఐరనే వంచాలా ఏంటి..రష్మిక గెస్ట్ రోల్ లో చేస్తే చాలాదా అంటున్నారు.

 ‘ఫ్యామిలీ స్టార్‌’ సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. అయితే అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. 2024 మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  గీతగోవిందం తర్వాత విజయ్ - పరశురామ్ కాంబినేషన్ ఫ్యామిలీ స్టార్ మూవీతో మరోసారి రిపీట్ అవుతోంది. దీంతో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది. గ్లింప్స్ కూడా ఆకట్టుకుంది.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. 

click me!