ఛలో చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత గీతాగోవిదం అనూహ్య విజయంతో స్టార్ అయిపోయిన కన్నడ నటి రష్మిక మందనా. ఆ చిత్రం తరువాత మహేష్ సినిమాలో సైతం ఆమెకు ఆఫర్ వచ్చింది. అలాగే గీతాగోవిందం చిత్ర హీరో విజయ్దేవరకొండతోనే మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో జత కట్టింది.
ఇప్పటికే డియర్ కామ్రేడ్ సినిమాపై కన్నడ జనం కోపంగా ఉన్నారు. తమ మాతృభాషలో తక్కువ థియోటర్స్ రిలీజ్ చేసారంటూ మండిపడి బాయ్ కాట్ కు పిలుపు ఇచ్చారు. ఆ వివాదం ముగియక ముందే రష్మిక మరో సారి నోరు జారి తన వాళ్లకు శతృవు అయ్యింది. ఆమె తాజాగా మాట్లాడిన మాటలు కన్నడ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అందరూ ఆమెపై మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె మాట్లాడిందో చూద్దాం.
ఛలో చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత గీతాగోవిదం అనూహ్య విజయంతో స్టార్ అయిపోయిన కన్నడ నటి రష్మిక మందనా. ఆ చిత్రం తరువాత మహేష్ సినిమాలో సైతం ఆమెకు ఆఫర్ వచ్చింది. అలాగే గీతాగోవిందం చిత్ర హీరో విజయ్దేవరకొండతోనే మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంలో జత కట్టింది. మరో ప్రక్క తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం కార్తీకి జంటగా నటిస్తోంది. ఇలా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను దక్కించుకుంటోంది రష్మిక.
తాజాగా విజయ్దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో రిలీజైంది. డివైడ్ టాక్ వచ్చినా వీకెండ్స్ లో బాగానే కలెక్ట్ చేసింది. ఈ చిత్ర ప్రమోషన్ కోసం రష్మిక విజయ్దేవరకొండ, చిత్ర యూనిట్తో కలిసి నాలుగు రాష్ట్రాల్లోని అభిమానులను కలిసింది. అక్కడ మీడియా ఇంట్రాక్షన్ లో భాగంగా కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తున్నారు. ఏ భాషలో నటించడం కష్టం అనిపిస్తోందన్న మీడియా వాళ్ల ప్రశ్నకు ఏ మాత్రం ఆలోచించకుండా కన్నడ భాషలో మాట్లాడి నటించడం కష్టం అనిపిస్తోందని అంది. అంతే ఆ ఒక్క మాటతో అగ్గి రాజేసినట్లైంది.
దాంతో ఆమె సొంత రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. మాతృభాషను మాట్లాడడం కష్టంగా ఉందంటావా అంటూ కన్నడ సంఘాలు రష్మికపై మండిపడుతున్నారు. అంతే కాదు బాయ్కాట్ డియర్ కామ్రేడ్ అంటూ ఈమె చిత్రాలపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దీనికి నటి రష్మిక ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.