ఉన్న విషయమే మాట్లాడుతున్నారు.. తన తొడలపై రష్మీ బోల్డ్ కామెంట్!

By Udayavani DhuliFirst Published Aug 21, 2018, 1:28 PM IST
Highlights

ఇప్పటికే 'RX100' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. రష్మీ తొడలపై హాట్ కామెంట్స్ చేశాడు. సినిమా హోర్డింగ్ లో రష్మీ తొడలను చూస్తూ ఉండిపోయానని బోల్డ్ కామెంట్స్ చేశారు.

యాంకర్ గా బుల్లితెరపై తన సత్తా చాటుతోన్న రష్మీ గౌతమ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూ జనాల దృష్టి ఆకర్షించడానికి అందాల ఆరబోత కూడా ఓ రేంజ్ లో చేస్తోంది. తాజాగా ఆమె నటించిన 'అంతకు మించి' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కూడా రష్మీ తన అందాల ఆరబోత ఏమాత్రం మొహమాట పడలేదని సినిమా ప్రోమోలు, ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇప్పటికే 'RX100' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. రష్మీ తొడలపై హాట్ కామెంట్స్ చేశాడు. సినిమా హోర్డింగ్ లో రష్మీ తొడలను చూస్తూ ఉండిపోయానని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఇక అప్పటినుండి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న రష్మీకి ఆమెకు తొడలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తాజాగా ఈ విషయంపై బోల్డ్ గా స్పందించింది రష్మీ. ''నాకు ఉన్న వాటి గురించే కదా మాట్లాడుతున్నారు. అందుకే తప్పేముందని'' చెప్పుకొచ్చింది. అయితే సినిమాలో కేవలం ఇదొక్కటే కాకుండా చాలా విషయాలున్నాయని స్పష్టం చేసింది. జానీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. 

click me!