దిల్ రాజు నా ఫోన్ లాక్కొని వార్నింగ్ ఇచ్చారు: రాశిఖన్నా

Published : Aug 06, 2018, 06:12 PM ISTUpdated : Aug 06, 2018, 06:14 PM IST
దిల్ రాజు నా ఫోన్ లాక్కొని వార్నింగ్ ఇచ్చారు: రాశిఖన్నా

సారాంశం

డైరెక్టర్ సతీష్ కూడా పాత్రలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేవారు. వారిద్దరూ పడ్డ కష్టం సినిమా అవుట్ ఫుట్ లో తెలిసింది. సినిమాలో నా పాత్రా పండడానికి కారణం కూడా వారిద్దరే

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన సత్తా చాటుతోంది. 'తొలిప్రేమ' చిత్రంతో తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్న ఈ నటి హీరోయిన్ గా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా రాశి కొన్ని ఆసక్తికర విషయాలుచెప్పుకొచ్చింది . 'ఈ సినిమాలో శ్రీ అనే పాత్ర కోసం చాలా కష్టపడ్డాను.

నా పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నాకు ఎలాంటి సందేహం కలిగినా.. వెంటనే దర్శకుడిని అడిగి తెలుసుకునేదాన్ని. అమలాపురంలోని పెళ్లి సన్నివేశాలు తీసే సమయంలో దిల్ రాజు చాలా కఠినంగా వ్యవహరించారు. సెట్ లో ఉన్నప్పుడు నాచేతిలో ఫోన్ ఉండకూడదని ఆయన ముందే చెప్పారు. కానీ నేను ఫోన్ పట్టుకొని ఉన్నానని నా చేతిలో ఫోన్ లాగేసుకొని వార్నింగ్ ఇచ్చారు.

ఫోకస్ మొత్తం షూటింగ్ మీదే పెట్టాలని దిల్ రాజు చెప్పారు. డైరెక్టర్ సతీష్ కూడా పాత్రలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేవారు. వారిద్దరూ పడ్డ కష్టం సినిమా అవుట్ ఫుట్ లో తెలిసింది. సినిమాలో నా పాత్ర పండడానికి కారణం కూడా వారిద్దరే. ఈ సినిమా చూసిన మా ఫాదర్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నారు'' అని స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

AA22xA6 Title Poster: ప్రీ లుక్‌తోనే గూస్‌ బంమ్స్ తెప్పించిన బన్ని, అభిమానులకు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్..
Actors Before Life: సినిమాల్లోకి రాకముందు తాప్సీ, కియారా, మాధవన్ ఏం చేసేవారో తెలుసా?