ప్రస్తుతం రానా `విరాటపర్వం`, పవన్తో `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు.
రానా దగ్గుబాటి మరో పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన `విరాటపర్వం`, పవన్తో `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఆచంట గోపీనాథ్ నిర్మించనున్నారు. విశ్వశాంతి పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందట.
నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు మాట్లాడుతూ, `ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం` అని తెలిపారు.