వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కీలకపాత్రలో నటుడు ఖరారు

First Published Oct 21, 2017, 3:44 PM IST
Highlights
  • ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మిపార్వతి వచ్చాక జరిగిన కథతో వర్మ సినిమా
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కీలకపాత్రలో నటుడు ఖరారు
  • లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఫుల్లుగా దృష్టిపెట్టిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ పై... తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలతో... వర్మ రివర్స్ కౌంటర్స్ తో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక వర్మ కూడా వచ్చే దీపావళికి లక్ష్మీస్ ఎన్టీఆర్ తో మాంచి లక్ష్మీ బాంబు పేలుస్తానంటూ ఇప్పటికే పేస్ బుక్ సందేశం కూడా పంపాడు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వేళ వర్మ సినిమా ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

 

ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తన ఫోకస్ అంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ మీదనే పెట్టాడు. ఈ సినిమా విషయం లో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ఎంతమంది అడ్డం పడినా కూడా రామూ మాత్రం ఎక్కడా తగ్గేది లేదు అంటున్నాడు.

 

ఈ సినిమా కి సంబంధించి కీలక పాత్రలు మూడు అనేది జగమెరిగిన సత్యం. ఇవే సినిమాకు ఆయువుపట్టు అని చెప్పొచ్చు. మొదటిది సీనియర్ ఎన్టీఆర్ కాగా రెండోది లక్ష్మీ పార్వతి పాత్ర. వీరిద్దరి పాత్రలకీ ఎవరిని పెట్టాలి అనేది ఇంకా తేల్చలేదు వర్మ. అయితే చిత్రంలో మూడో ముఖ్యమైన పాత్ర కి సంబంధించి. గడ్డం చక్రవర్తి అలియాస్ జేడీ చక్రవర్తి అని అనుకుంటున్నారట.

 

ఈ పాత్ర ఎవరిదో కాదు చంద్రబాబుది. అవును లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరవాత అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటారు చాలామంది. చంద్రబాబు - లక్ష్మీ పార్వతి ల మధ్యలో అనేక గొడవలు కూడా అయ్యాయనీ అందుకే ఎన్టీఆర్ కి.. చంద్రబాబు యాంటీ అయ్యారు అనేది ఒక వాదన. సో ఈ పరిస్థితి లో చంద్రబాబు క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ వ్యక్త్తి చెయ్యాల్సి ఉంది అందుకే వర్మ జేడీ ని తీసుకొచ్చారని ఫిలిం నగర్ లో అనుకుంటున్నారు.

click me!