
రామ్చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. యాక్షన్ కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ నెలాఖర్లో సినిమా ప్రారంభోత్సవం జరిపి, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపనున్నట్లు సమాచారం.
బోయపాటి శ్రీను ఈ ఏడాది ‘జయ జానకి నాయక’ చిత్రం తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ గా నిలిచింది.
రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత ఇందులో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ఈ చిత్రం తర్వాతే వుంటుందని తెలుస్తోంది.