చాలా రోజుల తరువాత రంభ కుటుంబం నుంచి ఒక సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. రీసెంట్ గా ఆమె ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందట. ఈ విషయాన్నీ రంభ భర్త ఇంద్ర కుమార్ పద్మనాభన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదివరకే రంభ - ఇంద్ర కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించిన సంగతి తెలిసిందే.
అలనాటి అందాల తార రంభ ప్రస్తుతం సినిమా ఫీల్డ్ కి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే చాలా రోజుల తరువాత రంభ కుటుంబం నుంచి ఒక సంతోషకరమైన వార్త బయటకు వచ్చింది. రీసెంట్ గా ఆమె ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందట. ఈ విషయాన్నీ రంభ భర్త ఇంద్ర కుమార్ పద్మనాభన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇదివరకే రంభ - ఇంద్ర కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించిన సంగతి తెలిసిందే. 2010లో వీరిద్దరూ ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీన కొడుకు పుట్టినట్లు ఇంద్రకుమార్ తెలిపారు. ప్రస్తుతం వీరు కెనడాలోని టొరంటో ప్రాంతంలో ఉంటున్నారు. మ్యారేజ్ తరువాత రంభ సినిమాలను తగ్గించేసింది. ఆ మధ్యలో కొన్ని రియాలిటీ షోల్లో జడ్జ్ గా వ్యవహరించారు.
రంభ తెలుగుతో పాటు హిందీ - తమిళ్ మరియు మలయాళం - కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేశారు. ఎక్కువగా నటించింది మాత్రం టాలీవుడ్ లోనే. రంభ తెలుగులో చివరగా 2008లో దొంగ సచ్చినోళ్ళు అనే సినిమాలో నటించారు.