మణిరత్నం రియల్ స్టోరీ చూపించబోతున్నాడా..?

By Udayavani DhuliFirst Published Sep 25, 2018, 4:11 PM IST
Highlights

ప్రస్తుతం ఉన్న ఫిలిం మేకర్స్ తో మణిరత్నం లాంటి దర్శకులు పోటీ పడలేకపోతున్నారు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా.. సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు. 

ప్రస్తుతం ఉన్న ఫిలిం మేకర్స్ తో మణిరత్నం లాంటి దర్శకులు పోటీ పడలేకపోతున్నారు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా.. సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోతున్నారు. మధ్యలో 'ఓకే బంగారం'తో ఓ హిట్ వచ్చినా.. అది మణిరత్నం రేంజ్ సినిమా కాదనే విమర్శలు వినిపించాయి. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన 'నవాబ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

తమిళంలో 'చిక్కా చైవంత వానమ్' అనే పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'నవాబ్' పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా ట్రైలర్లను బట్టి తండ్రి అధికారాన్ని దక్కించుకోవడం కోసం అన్నదమ్ములు మధ్య జరిగే పోరే ఈ సినిమా. అయితే ఈ సినిమా రియల్ స్టోరీ అని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

ఓ పొలిటికల్ ఫ్యామిలీ పరిణామాలను ఆధారంగా చేసుకొని మణిరత్నం ఈ సినిమాని రూపొందించారని అంటున్నారు. ఒక సీనియర్ పొలిటీషియన్ వారసత్వం విషయంలో తనయుల అంతర్గత పోరునే ఈ సినిమాగా రూపొందించారట మణిరత్నం.

అయితే ఈ విషయాన్ని మణిరత్నం ధ్రువీకరించలేదు. ఈ విషయంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. అరవింద్ స్వామి, జ్యోతిక, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్, శింబు వంటి తారలు నటిస్తోన్న ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.   

click me!