మెగాస్టార్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ షూరు.. సీడీపీ రిలీజ్‌ చేసిన చెర్రీ

Published : Aug 21, 2020, 06:27 PM ISTUpdated : Aug 21, 2020, 06:30 PM IST
మెగాస్టార్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ షూరు.. సీడీపీ రిలీజ్‌ చేసిన చెర్రీ

సారాంశం

చిరు బర్త్ డే సంబరాలు ఈ సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. సాయంత్ర ఆరు గంటల నుంచి ఆన్‌లైన్‌  సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటగా చిరంజీవి బర్త్ డే సీడీపీని రామ్‌చరణ్‌ లాంచ్‌ చేయడంతో ఈ వేడుక షురూ అయ్యింది.   

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందడి షురూ అయ్యింది. రేపు(ఆగస్ట్ 22)న చిరంజీవి బర్త్ డే అనే విషయం తెలిసిందే. ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చిరు బర్త్ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అయినా ఆన్‌లైన్‌లో ద్వారా వేడుకల్లో అభిమానులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. 

దీనిలో వేలల్లో అభిమానులు పాల్గొనేలా ఏర్పాటు చేశారు. అయితే చిరు బర్త్ డే సంబరాలు ఈ సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయి. సాయంత్ర ఆరు గంటల నుంచి ఆన్‌లైన్‌ సంబరాలు ప్రారంభమయ్యాయి. మొదటగా చిరంజీవి బర్త్ డే సీడీపీని రామ్‌చరణ్‌ లాంచ్‌ చేయడంతో ఈ వేడుక షురూ అయ్యింది. ఆరు గంటలకు ప్రారంభయ్యే ఈ వేడుక ఉదయం వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక చరణ్‌ లాంచ్‌ చేసిన సీడీపీలో చిరు కెరీర్ ప్రారంభం నుంచి `సైరా నరసింహారెడ్డి` వరకు ఆయన కెరీర్‌లోని మైలు రాయిలాంటి సినిమాల్లోని ఆయన గెటప్ లను చూపిస్తూ పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది.

బర్త్ డే వేడుకలకు సంబంధించి ఓ షెడ్యూల్‌ పోస్టర్‌ని పంచుకున్నారు. ఇందులో ఏడు గంటలకు ఎనబై మంది సెలబ్రిటీలు కామన్‌ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. అలాగే ఎనిమిది గంటలకు నాగబాబు బర్త్ డే విశెష్‌ తెలియజేస్తారు. తొమ్మిది గంటలకు సాయితేజ్‌ తన విశెష్‌ తెలియజేస్తారు. పది గంటలకు అఖిల భారత చిరంజీవి యువత కార్యక్రమం ఉంటుంది. పదిన్నరకు చిరంజీవికి సంబంధించి తెలియని విషయాలు పంచుకుంటారు. పదకొండు గంటలకు ఇప్పటి వరకు చూడని చిరు ఫోటోలను విడుదల చేస్తారు. పన్నెండు గంటలకు చిరంజీవికి బర్త్ డే విశెష్‌ తెలియజేస్తారు. 

రేపటికి సంబంధించిన షెడ్యూల్‌ని కూడా ఇందులో వెల్లడించారు. ఉదయం ఎనిమిది గంటలకు అల్లు అర్జున్‌.. చిరుకి బర్త్ డే విశెష్‌ తెలియజేయడంతో మళ్ళీ వేడుకలు షురూ కానున్నాయి. ఆ తర్వాత గంట గంటకు వరుణ్‌ తేజ్‌, సుష్మితా, అల్లు శిరీష్‌, నిహారిక, కళ్యాణ్‌ దేవ్‌ విశెష్‌లు తెలియజేస్తారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం