మోడీ.. రజనీ.. తర్వాత అక్షయ్‌దే ఆ ఘనత..!

Published : Aug 21, 2020, 05:40 PM IST
మోడీ.. రజనీ.. తర్వాత అక్షయ్‌దే ఆ ఘనత..!

సారాంశం

ఇండియాలో ఇలా వెళ్ళిన ప్రముఖులు చాలా తక్కువ. ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోడీ, ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ `ఇన్‌ టూ ది వైల్డ్` కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో ఆక్షయ్‌ కుమార్‌కి ఆ అరుదైన అవకాశం దక్కింది.

`వైల్డ్ లైఫ్‌` గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రకృతిని, అడవులు, అందులోని పక్షులు, జంతువులు, ఇతర జీవరాశులు, మనుషులు, మొత్తంగా వాటి జీవన విధానం, జీవన గమ్యాన్ని వివరిస్తుంది. డిస్కవరీ ఛానెల్‌లో ఇది ప్రసారమవుతుంది. ఆద్యంతం సాహసభరితంగా `ఇన్‌ టూ ది వైల్డ్` అనే కార్యక్రమం సాగుతుంది. 

ప్రముఖ సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన వైల్డ్ లైఫ్‌ గురించి ఇందులో వివరిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు ఈ కార్యక్రమంలో ప్రముఖులను కూడా తీసుకెళ్తుంటారు. వారితోనూ సాహసం చేయిస్తుంటారు. ఈ క్రమంలో వారి అనుభవాలను, వారు ఎదిగిన విధానాన్ని ప్రపంచానికి చెబుతుంటారు. 

ఇండియాలో ఇలా వెళ్ళిన ప్రముఖులు చాలా తక్కువ. ఇటీవల దేశ ప్రధాని నరేంద్రమోడీ, ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఈ `ఇన్‌ టూ ది వైల్డ్` కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో ఆక్షయ్‌ కుమార్‌కి ఆ అరుదైన అవకాశం దక్కింది. ఈ విషయాన్ని అక్షయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. 

ఇందులో `మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు. పిచ్చి ఉన్న వాళ్ళే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్ళగలుగుతారు` అని అక్షయ్‌ ఈ వీడియోకి క్యాప్షన్‌ పెట్టాడు. ఈ షూటింగ్‌ ఈ ఏడాది జనవరిలోనే జరిగిందట. కర్నాటకలోని బందీపూర్‌ టైగర్‌ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ ఎపిసోడ్‌ని షూట్‌ చేశారట. ఈ షూటింగ్‌ను అక్షయ్‌ కుమార్‌ ఒక్క రోజులో పూర్తి చేశారట. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 11న రాత్రి ఎనిమిది గంటలకు డిస్కవరీ ప్లాస్‌ ఇండియాలో ప్రసారం కానుంది. అలాగే డిస్కవరీ ఛానెల్‌లో సెప్టెంబర్‌ 14న రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం చేయనున్నారు. ఇదిలా ఉంటే డిస్కవరీ ఛానెల్‌ ప్రారంభించి 25ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అక్షయ్‌ ఎపిసోడ్‌ ప్రసారం కావడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌