`ఆర్‌ఆర్‌ఆర్‌` దోస్తీ సాంగ్‌పై విమర్శలు.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కాకుండా సింగర్లని హైలైట్‌ చేయడంపై కామెంట్లు

Published : Aug 01, 2021, 05:11 PM IST
`ఆర్‌ఆర్‌ఆర్‌` దోస్తీ సాంగ్‌పై విమర్శలు.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కాకుండా సింగర్లని హైలైట్‌ చేయడంపై కామెంట్లు

సారాంశం

 ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా విడుదల చేసిన `దోస్తీ` పాటని ఐదు భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఐదుగురు సింగర్లతో పాడించారు. తెలుగు వెర్షన్‌ పాటని హేమచంద్ర పాడారు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` `దోస్తీ` సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఎంట్రీ గూస్‌బమ్స్ తెప్పిస్తుందంటూ ఇరు హీరోల అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా విడుదల చేసిన `దోస్తీ` పాటని ఐదు భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఐదుగురు సింగర్లతో పాడించారు. తెలుగు వెర్షన్‌ పాటని హేమచంద్ర పాడారు. అయితే ఇప్పుడు ఇదే పలు విమర్శలకు తావిస్తుంది. మిగిలిన అన్ని భాషల సింగర్లు చాలా బేస్‌ వాయిస్‌తో అద్భుతంగా పాడారని, కానీ తెలుగు వెర్షన్‌ సాంగ్‌లో మాత్రం ఆ బేస్‌ మిస్‌ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా అంటే ఇండియా వైడ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి సూపర్‌స్టార్స్ నటిస్తుండటం, రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడం, పైగా ఇండియా వైడ్‌గా దాదాపు పది భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హేమచంద్ర పాడిన పాట ఆ స్థాయిని అందుకోలేదనే టాక్‌ వినిపిస్తుంది. అదే సమయంలో దోస్త్ సాంగ్‌లో హీరోలను ప్రధానంగా చూపించాల్సిందని, కానీ సింగర్లని, హైలైట్‌ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

దోస్తీ అంటూ ఇద్దరు హీరోల మధ్య స్నేహాన్ని ఆవిష్కరించేలా పాట ఆసాంతం సాగాలని, కానీ చివర్లో మాత్రమే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను చూపించడం తమని అసంతృప్తికి గురి చేసిందని ఇద్దరు హీరోల అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పాట ప్రమోషనల్‌ సాంగ్‌ అయినప్పటికీ హీరోలను హైలైట్‌గా చూపించి ఉంటే ఇంకా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బహుశా అదే కారణంతో పాటకి వ్యూస్‌ కూడా ఊహించని విధంగా రావడం లేదని అంటున్నారు క్రిటిక్స్. మరి దీన్ని జక్కన్న టీమ్‌ ఎలా తీసుకుంటుందో చూడాలి. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందుతుంది. ఇందులో చరణ్‌ సరసన అలియా భట్‌, ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ నటిస్తుంది. అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టాకీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఓ సాంగ్‌ పెండింగ్‌లో ఉంది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తి కానుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 13న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు