రామ్ చరణ్ మరో మూవీపై క్రేజీ బజ్.. ఆ డైరెక్టర్ తోనే కన్ఫమ్ అంటున్న ఫ్యాన్స్..

By team teluguFirst Published May 21, 2022, 12:18 PM IST
Highlights

మెగా హీరో రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘ఆర్సీ15’ చిత్రీకరణను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో మరో సినిమాకు చెర్రీ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
 

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ (Ram Charan) ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి వంద మార్కులు పడ్డాయి. ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో ‘ఆర్సీ15’చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. ఈ మూవీ చిత్రీకరణ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు శంకర్. అయితే ఈ మూవీ తర్వాత చెర్రీ ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు వర్క్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా చరణ్ మరో సినిమాపై క్రేజీ బజ్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ లైన్ అప్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలో నటిస్తూ అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తున్నాడాయన. తాజాగా సమాచారం ప్రచారం.. ఈ రెండు చిత్రాలు కాకుండా మరో ప్రాజెక్ట్ ను కూడా ఒకే చేశాడంట చెర్రీ. ఈ మేరకు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాలతో తన మార్క్ చూపించిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj)తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్టు తెలుస్తోంది. ఈ కోలీవుడ్ డైరెక్టర్ ప్రస్తుతం కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత చెర్రీతోనే కలిసి పనిచేయన్నారని సమాచారం. 

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకు కన్ఫమ్ అయినట్టు సమాచారం రాలేదు. కానీ తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం లోకేష్ కనగరాజుతో సినిమా పక్కా అంటూ సంకేతాలు వస్తున్నాయి. మరో ఆయన అభిమానులు కూడా సినిమా ఒకే అనట్టు సోషల్ మీడియాలో కొంతమేర ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆ సినిమా అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు, తెలుగు ప్రేక్షకులు మరింత ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతుందోనంటూ ఎదరుచూస్తున్నారు.    

చరణ్ ప్రస్తుతం RC15 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రంలో ద్విపాత్రినభయం చేయనుడటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన నాలుగు సాంగ్స్ ను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. వీటిలో రెండు సాంగ్స్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుందంట యూనిట్. త్వరలో చిత్ర టైటిల్, పోస్టర్స్ కూడా రిలీజ్ కానున్నాయి.

click me!