ప్రధాని మోడీకి రజనీకాంత్‌ ధన్యవాదాలు.. పురస్కారంపై తీవ్ర విమర్శలు..

Published : Apr 01, 2021, 02:51 PM IST
ప్రధాని మోడీకి రజనీకాంత్‌ ధన్యవాదాలు.. పురస్కారంపై తీవ్ర విమర్శలు..

సారాంశం

రజనీకాంత్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్రమోడీ రజనీకి అభినందనలు తెలిపారు. దీంతో మోడీకి రజనీకాంత్‌ ధన్యవాదాలు తెలిపారు. 

రజనీకాంత్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని నరేంద్రమోడీ రజనీకి అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన గొప్పతనాన్ని ప్రశంసించారు. `తరతరాలుగా ప్రాచుర్యం పొందిన వారిగా కొంతమందినే గొప్పగా చెప్పుకోవచ్చు. విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన వ్యక్తిత్వం కలిసి రజనీకాంత్‌గారు అందులో ఒకరు. భారతీయ సినిమాకి విశేషమైన సేవలందించిన తలైవాకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు` అని తెలిపారు ప్రధాని నరేంద్రమోడి. 

అందుకు రజనీకాంత్‌ స్పందిస్తూ మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా రజనీ చెబుతూ, `మీ శుభాకాంక్షలు ఎంతో వినయంగా,  గౌరవంగా భావిస్తున్నా. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో నన్ను గౌరవించినందుకు గౌరవనీయులైన ప్రియమైన ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా` అని అన్నారు రజనీ. ఈ సందర్భంగా తనకు అభినందనలు తెలిపిన వారికి రజనీ ధన్యవాదాలు తెలిపారు. 

ఇదిలా ఉంటే రజనీకి ఈ పురస్కారం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడుకి ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో రజనీ ఫ్యాన్స్ ఓట్లు పొందేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అంటున్నారు. అవార్డు ఒక ఓట్‌ గేమ్‌ గా, ఓట్ బ్యాంక్‌గా మారిందంటున్నారు. అంతేకాదు ఒక్క సినిమా దర్శకత్వం వహించిన రజనీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. దాదా సాహెబ్‌ ఫాల్కే గొప్ప దర్శకుడు. అది దర్శకత్వం వహించిన గొప్ప వారికే అవార్డుని అందిస్తుంటారు. కానీ ఇప్పుడది మిస్‌ యూజ్‌ అవుతుందంటున్నారు. 

గతంలో ఎలాంటి దర్శకత్వం వహించని ఏఎన్నార్‌కి కాంగ్రెస్‌ ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ఇచ్చారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అదే తప్పుని చేసిందనే విమర్శలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. నిజానికి ఈ పురస్కారానికి కమల్‌ హాసన్‌ అర్హుడని, ఆయన అనేక మహానటుడు, అనేక గొప్ప చిత్రాలను దర్శకుడిగా రూపొందించారు. అదే సమయంలో గొప్ప చిత్రాలను నిర్మించారు. సింగర్‌, రైటర్‌, మ్యూజిషియన్‌ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్నారు. ఆయన ఈ అవార్డుకి అర్హుడనే నినాదం ఉపందుకుంది. ఇదే కాదు తెలుగుకి అన్యాయం జరిగిందనే టాక్‌ వినిపిస్తుంది. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ అవార్డు కి అర్హుడని, ఆయన మూడువందలకుపైగా చిత్రాల్లో నటించారు. అనేక సినిమాలు దర్శకత్వం వహించారు. నిర్మించారు. స్టూడియోస్‌తో సినిమాకి సేవలందించారు. ఆయన భార్య విజయనిర్మల దాదాపు నలభైకిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. కనీసం వారికి పద్మ శ్రీ కూడా ఇవ్వలేదని అంటున్నారు. మొత్తంగా రజనీకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా