rajinikanth health update: మెదడులో బ్లాక్స్ గుర్తించిన వైద్యులు

Published : Oct 29, 2021, 03:28 PM ISTUpdated : Oct 29, 2021, 05:02 PM IST
rajinikanth health update: మెదడులో బ్లాక్స్ గుర్తించిన వైద్యులు

సారాంశం

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కావేరి ఆసుపత్రిలో ఆయన గురువారం సాయంత్రం చేరిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు అఫీషియల్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హెల్త్ అప్‌డేట్‌ వచ్చింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని ప్రకటించారు. అయితే రజనీకాంత్‌ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మెదడు రక్తనాళ్లల్లో బ్లాక్స్ గురించినట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 

రజనీకాంత్‌ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన హుఠాహుటిన ఆసుపత్రిలో చేరడంతో రజనీ ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెగ్యూలర్‌ హెల్త్ చెకప్‌ కోసం ఆసుపత్రికి వెళ్లారని, ఆరోగ్యం బాగానే ఉన్నారని వైద్యలు, ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశారు. నిన్నటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అనేక పరీక్షల అనంతరం మెదడు రక్తనాళ్లల్లో బ్లాంక్స్ గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స జరుగుతుందన్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో `పెద్దన్న` పేరుతో విడుదల కాబోతుంది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. శివ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. రజనీకి చెల్లిగా కీర్తిసురేష్‌, మీనా, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేష ఆదరణ పొందింది. 

మరోవైపు రజనీకాంత్‌ ఇటీవల ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్‌ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి నుంచి అందుకున్న విషయం తెలిసిందే. ఇండియన్‌ సినిమాకు ఆయన చేసిన విశేష సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్‌ అటు ప్రధాని నరేంద్రమోడీని, ఇటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలిసిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్