వేరే ఆప్షన్ లేక.. కూతురు సినిమాని కొంటున్న రాజశేఖర్

By Udaya DFirst Published Apr 8, 2019, 10:28 AM IST
Highlights

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుపడ్డ  రాజశేఖర్ రిటైర్ అయ్యారనుకున్న టైమ్ లో గరుడవేగ అంటూ ఫామ్ లోకి వచ్చాడు. 

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుపడ్డ  రాజశేఖర్ రిటైర్ అయ్యారనుకున్న టైమ్ లో గరుడవేగ అంటూ ఫామ్ లోకి వచ్చాడు. తన హవా నడుస్తున్న సమయంలో తన కుమార్తెలని వెండితెరకు పరిచయం చేయాలని ఫిక్సై అందకు తగ్గట్లు గా ప్రాజెక్టులు సెట్ చేసారు. చిన్న కూతురు శివాత్మక , విజయదేవరకొండ తమ్ముడు చేస్తున్న దొరసాని ప్రాజెక్ట్ ఓ కొలిక్కి వచ్చేసింది. కానీ పెద్ద కూతురు శివాని తొలి సినిమానే ఆగిపోయింది. 

శివాని తెరంగేట్రంలో అడవి శేష్ హీరోగా హిందీ సూపర్ హిట్ 2  స్టేట్స్ రీమేక్ ను లాస్ట్ ఇయిర్ గ్రాండ్ గా లాంచ్ చేసారు. శివాని రాజశేఖర్ తొలి చిత్రం కాబట్టి ఆయన అభిమానులు అంచనాలు బాగానే పెట్టుకున్నారు. గూడచారి తర్వాత ప్రాజెక్ట్ కాబట్టి అడవి శేష్ కూడా దీని మీద మంచి ఇంట్రస్ట్ చూపించాడు. అనుకున్నట్లుగా కొన్ని రోజులు షూటింగ్ సవ్యంగానే సాగింది.

అయితే  వెంకట్ కుంచెం దర్శకుడిగా సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారని అడవి శేషు ప్రాజెక్టుని ప్రక్కన పెట్టేసారట. దర్శకుడికి హీరోకు మధ్య  క్రియేటివ్ గ్యాప్ రావడం వల్ల షూటింగ్ ఆగింది. అలాగే హీరో పాత్రకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ,  శివాని రోల్ ని పెంచడం వల్ల  ఇలా జరిగింది అని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏం జరిగినా అడవి శేషు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి అతని కెరీర్ కు నో ప్లాబ్లం. వచ్చిన చిక్కు అంతా.. శివాని కెరీర్ కే.

దాంతో ఇక ఈ ప్రాజెక్టు మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని రాజశేఖర్ , జీవిత దంపతులు ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా నిర్మాతతో చర్చలు జరుపుతున్నారట. అంతా ఓకే అనుకుంటే డైరక్టర్ గా జీవిత సీన్ లోకి వచ్చి షూటింగ్ ఫినిష్ చేస్తుందని తెలుస్తోంది. మరి హీరోగా అడవి శేషు కంటిన్యూ అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. 

click me!