
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ కోసం దేశ విదేశాల్లోని అభిమానులు కళ్ళఉ కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ట్రిపుల్ ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నెల 25న ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రానుంది జక్కన్న చెక్కిన సినిమా. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఏ హీరో పాత్ర ముందుగా పరిచయమవుతుంది.. సినిమా ఓపెనింగ్ లో ఎవరు కనిపిస్తారు.. ఒక పాత్ర మరొక పాత్రను ఎంతసేపటిలో కలుసుకుంటుంది, కథ ట్రాక్ ఎక్కడానికి ఎంత టైమ్ పడుతుంది అనేదానిపై ఫ్యాన్స్ కు రకరకాల డౌట్లు వస్తున్నాయి.ఈ విషయాల గురించి అందరిలో ఆసక్తిని రేకెత్తుంది. ఈ ప్రశ్న రాజమౌళికి తాజా ఇంటర్వ్యూలో ఎదురైంది.
ఇక ఈ ప్రశ్నకు స్పందించిన రాజమౌళి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ట్రిపుల్ ఆర్ లో మెయిన్ క్యారెక్టర్లు అయిన సీతారామరాజు, భీమ్ పాత్రలు కలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆ పాత్రల పరిచయం తరువాత ఎమోషనల్ జర్నీ మొదలు కావడానికి కూడా ఎక్కువ సమయం ఉండదు.ఇదంతా కూడా 20 నిమిషాల్లోనే జరిగిపోతుందన్నారు. అయితే ముందు ఎవరి ఎంట్రీ ఉంటంది అన్న విషయంపై మాత్రం సస్పెన్స్ మెయిటేన్ చేశారు జక్కన్న.
ఈ విషయంలో అటు చరణ్ ఫ్యాన్స్.. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మా స్టార్ ఎంట్రీ ముందు అంటే మా స్టార్ ఎంట్రీ ముందు ఉంటుంది అని ఇప్పటికే మాటల తూటాలు కూడా పేలుస్తున్నారు. అయితే జక్కన్న మాత్రం థియేటర్ లో ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రతీ ప్రేక్షకుడు మళ్లీ ఈ సినిమా చూడాలనే ఆలోచనతోనే థియేటర్లలో నుంచి బయటికి వస్తారు అని చెపుతున్నారు.